రాబోయే ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్ విషయంలో కేసీఆర్ లెక్క తప్పుతోందా ? క్షేత్ర స్ధాయిలో జరగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే బీఆర్ఎస్ కే లాభమని కేసీయార్ తో పాటు అధికారపార్టీ నేతలంతా అంచనా వేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. దాంతో ముందు టీడీపీ తరువాత వైఎస్సార్టీపీ పోటీ నుండి విరమించుకున్నాయి. టేజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను కూడా కలుపుకున్నారు. ఇక్కడే కేసీయార్ లెక్కతప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మూడోసారి గెలిచి కేసీయార్ కు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనను కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. మరోవైపు బీజేపీ పూర్తిగా డీలాపడిపోయింది. దాంతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అనే ప్రచారం పెరిగిపోతోంది. ముఖ్యంగా జనాల్లో కాంగ్రెస్ బలం బాగా పుంజుకుంటోందనే మౌత్ టాక్ విపరీతంగా పెరిగిపోతోంది.
రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గం ఓట్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది బీఆర్ఎస్ పైన మానసికంగా దెబ్బకొట్టే అంశమనే చెప్పాలి. ఈ అంశం ఎంతవరకు నిజమనే విషయం తేలేది డిసెంబర్ 3వ తేదీ ఫలితాల్లో మాత్రమే. అయినా కమ్మ సామాజికవర్గమంతా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వబోతున్నట్లు ప్రచారమైతే పెరిగిపోతోంది. టీడీపీ పోటీనుండి తప్పుకోవటంతో ఈ విషయం నిజమే అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయ్యింది.
రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవటంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. మూడో ఎన్నికలో కూడా ఓడిపోతే జనాలు పార్టీని మరచిపోవటం ఖాయం. బీఆర్ఎస్ మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయి వాళ్ళంతట వాళ్ళుగా జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసే పరిస్ధితి వస్తే మాత్రమే అధికారంలోకి వస్తుంది. అయితే అంతవరకు వెయిట్ చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ సీనియర్లంతా దాదాపు ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం కూడా తెలంగాణాలో ఊపు పెరిగిపోవటానికి కారణమైంది. మొత్తానికి గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే హ్యాట్రిక్ పై కేసీయార్ లెక్క తప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on November 5, 2023 10:01 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…