Political News

కేసీయార్ లెక్క తప్పుతోందా ?

రాబోయే ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్ విషయంలో కేసీఆర్ లెక్క తప్పుతోందా ? క్షేత్ర స్ధాయిలో జరగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే బీఆర్ఎస్ కే లాభమని కేసీయార్ తో పాటు అధికారపార్టీ నేతలంతా అంచనా వేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. దాంతో ముందు టీడీపీ తరువాత వైఎస్సార్టీపీ పోటీ నుండి విరమించుకున్నాయి. టేజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను కూడా కలుపుకున్నారు. ఇక్కడే కేసీయార్ లెక్కతప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మూడోసారి గెలిచి కేసీయార్ కు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనను కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. మరోవైపు బీజేపీ పూర్తిగా డీలాపడిపోయింది. దాంతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అనే ప్రచారం పెరిగిపోతోంది. ముఖ్యంగా జనాల్లో కాంగ్రెస్ బలం బాగా పుంజుకుంటోందనే మౌత్ టాక్ విపరీతంగా పెరిగిపోతోంది.

రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గం ఓట్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది బీఆర్ఎస్ పైన మానసికంగా దెబ్బకొట్టే అంశమనే చెప్పాలి. ఈ అంశం ఎంతవరకు నిజమనే విషయం తేలేది డిసెంబర్ 3వ తేదీ ఫలితాల్లో మాత్రమే. అయినా కమ్మ సామాజికవర్గమంతా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వబోతున్నట్లు ప్రచారమైతే పెరిగిపోతోంది. టీడీపీ పోటీనుండి తప్పుకోవటంతో ఈ విషయం నిజమే అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయ్యింది.

రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవటంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. మూడో ఎన్నికలో కూడా ఓడిపోతే జనాలు పార్టీని మరచిపోవటం ఖాయం. బీఆర్ఎస్ మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయి వాళ్ళంతట వాళ్ళుగా జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసే పరిస్ధితి వస్తే మాత్రమే అధికారంలోకి వస్తుంది. అయితే అంతవరకు వెయిట్ చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ సీనియర్లంతా దాదాపు ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం కూడా తెలంగాణాలో ఊపు పెరిగిపోవటానికి కారణమైంది. మొత్తానికి గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే హ్యాట్రిక్ పై కేసీయార్ లెక్క తప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on November 5, 2023 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

17 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago