Political News

త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌-నారా లోకేష్‌లు ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వెళ్లి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ప‌వ‌న్ కుటుంబ కార్య‌క్ర‌మా ల నేప‌థ్యంలో ఇట‌లీ వెళ్లారు. ఈ క్ర‌మంలో బాబును ప‌రామ‌ర్శించ‌లేక పోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇట‌లీ నుంచి తిరిగి వ‌చ్చిన మ‌ర్నాడే ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఆయ‌న నివాసంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం గురించిన విష‌యాల‌ను చంద్ర‌బాబుతో చ‌ర్చించారు. అనంత‌రం రాజ‌కీయ అంశాల‌పై ఇరు వురు నేత‌లు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

అయితే.. రాజ‌కీయ అంశాల‌పై ప‌వ‌న్‌తో నేరుగా స్పందించ‌ని చంద్ర‌బాబు నారా లోకేష్‌ను రంగంలోకి దింపారు. దీంతో నారా లోకేష్‌తో గంట‌ల‌కు పైగా ప‌వ‌న్‌, మ‌నోహ‌ర్‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో ఇరు పార్టీలూ క‌లిసి పోరాడ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీలు.. ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించి.. పార్టీల‌ను క‌లిసి పోరాడేలా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా చేస్తున్నాయి. అయితే.. వైసీపీ దూకుడు, ప్ర‌భుత్వ పాల‌న అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి.. మ‌రిన్ని ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని టీడీపీ-జ‌న‌సేన‌లు నిర్ణ‌యించాయి.

ఈ క్ర‌మంలో ఆయా అంశాల‌పై నారా లోకేష్‌తో ప‌వ‌న్ చ‌ర్చించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌మ‌న్వ‌య స‌మావేశాల‌కు తోడుగా.. త్వ‌ర‌లోనే ఇరు పార్టీలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావాల‌ని నిర్ణ‌యించాయి. ఉమ్మ‌డి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌, బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం వంటి అంశాల‌పై ఇరు పార్టీలు కూడా.. సంయుక్తంగా ముందుకు సాగాలే కార్యాచ‌ర‌ణ‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌-నారా లోకేష్‌లు సంయుక్తంగా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

అంతేకాదు.. డిసెంబ‌రు తొలి వారం నాటికి.. సంక్రాంతి కానుక‌గా.. ఉమ్మ‌డి మేనిఫెస్టోను రూపొందించి విడుద‌ల చేయాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నాయి. మొత్తానికి ప‌వ‌న్‌తో నారా లోకేష్ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేకాదు.. ఇరువురు నాయ‌కులు క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తే.. ఏపీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

This post was last modified on November 4, 2023 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

54 minutes ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

2 hours ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

3 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

4 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

5 hours ago

ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసుకోవడం అవసరమా

ఇవాళ అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీకి రాకా టైటిల్ అనౌన్స్ చేసి ప్రీ లుక్  పోస్టర్ వదిలిన…

5 hours ago