వైసీపీ అధినేత జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డిలు అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు బెయిల్ పై ఉండి అధికార పార్టీ తరఫున అధికారం చలాయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు.
బెయిల్ పై ఉన్న విజయసాయి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిగా విజయసాయి ఉన్న సమయంలో కడప గూండాలను దించి భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎందరినో బెదిరిస్తూ అక్రమాలు, అరాచకాలు చేశారని విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను తన ఫిర్యాదులో వెల్లడించారు.
ఆల్రెడీ విజయసాయిపై 11 అభియోగాలు, అనేక సెక్షన్ల కింద కేసులున్నాయని పురందేశ్వరి విమర్శించారు. పదేళ్లుగా బెయిల్ పై బయట ఉంటూ సీబీఐ, ఈడీ కేసుల్లోని షరతులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా నిరోధిస్తున్నారని, పదేపదే వాయిదాలు కోరుతూ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విజయసాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ,దానిపై విచారణ జరపాలని ఆయన బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని సీజేఐని కోరారు.
This post was last modified on November 4, 2023 7:26 pm
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…