Political News

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. కానీ పునాది వేసింది కాంగ్రెస్!

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఆ దిశగా దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ బీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో కదులుతోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. హైదరాబాద్ ను తామే డెవలప్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ విషయంలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ డెవలప్మెంట్ కు బీఆర్ఎస్ కారణం కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ డెవలప్మెంట్ కు హైటెక్ సిటీ కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ హైటెక్ సిటీ నిర్మాణం ఘనతను కాంగ్రెస్ ఖాతాలో వేసేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. హైటెక్ సిటీ కట్టింది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని రేవంత్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కారణంగానే హైటెక్ సిటీ ఏర్పడిందని రేవంత్ స్పష్టం చేశారు. కానీ ఇలా చెప్పి వదిలేస్తే కాంగ్రెస్ కు కలిగే ప్రయోజనం శూన్యమే. అందుకు రేవంత్ తెలివిగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే కానీ పునాది వేసింది మాత్రం కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు. 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందని రేవంత్ పేర్కొన్నారు. ఇలా హైటెక్ సిటీ ని తమ ఖాతాలో వేసుకుని, హైదరాబాద్ డెవలప్మెంట్ కు కాంగ్రెస్ కారణమని చెప్పడమే రేవంత్ ఉద్దేశమని తెలుస్తోందని చెప్పాలి.

This post was last modified on November 4, 2023 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago