Political News

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. కానీ పునాది వేసింది కాంగ్రెస్!

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఆ దిశగా దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ బీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో కదులుతోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. హైదరాబాద్ ను తామే డెవలప్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ విషయంలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ డెవలప్మెంట్ కు బీఆర్ఎస్ కారణం కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ డెవలప్మెంట్ కు హైటెక్ సిటీ కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ హైటెక్ సిటీ నిర్మాణం ఘనతను కాంగ్రెస్ ఖాతాలో వేసేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. హైటెక్ సిటీ కట్టింది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని రేవంత్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కారణంగానే హైటెక్ సిటీ ఏర్పడిందని రేవంత్ స్పష్టం చేశారు. కానీ ఇలా చెప్పి వదిలేస్తే కాంగ్రెస్ కు కలిగే ప్రయోజనం శూన్యమే. అందుకు రేవంత్ తెలివిగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే కానీ పునాది వేసింది మాత్రం కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు. 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందని రేవంత్ పేర్కొన్నారు. ఇలా హైటెక్ సిటీ ని తమ ఖాతాలో వేసుకుని, హైదరాబాద్ డెవలప్మెంట్ కు కాంగ్రెస్ కారణమని చెప్పడమే రేవంత్ ఉద్దేశమని తెలుస్తోందని చెప్పాలి.

This post was last modified on November 4, 2023 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

2 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

2 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

2 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

3 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

4 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

4 hours ago