Political News

ఏపీ అధికారులకు కొత్త తిప్పలు తెస్తున్న జగనన్న రూ.2వేల మాట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక మాట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు.. ఆసుపత్రుల వద్ద తరచూ రచ్చ నెలకొంటోంది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాటేనని చెబుతున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఇళ్లకు వెళ్లే వేళలో.. ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2వేల ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.

మొదట్లో రూ.2వేల మొత్తాన్ని ఇచ్చినా.. తర్వాత ఆ విషయాల్ని వదిలేశారు. దీనికి సంబంధించిన నిధులు రాకపోవటంతో.. అధికారులు సైతం గమ్ముగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితులు మాత్రం సీఎం జగనన్న చెప్పిన రూ.2వేలు ఇవ్వరంటూ క్వారంటైన్ సెంటర్ల వద్ద గొడవ పెట్టుకుంటున్నారు. జగనన్న రూ.2వేల ఇవ్వమంటే.. ఇవ్వరా? మీరు తినేశారా? లాంటి ఆగ్రహావేశాల్ని చవిచూడాల్సి వస్తోంది.

రూ.2వేల సాయం గురించి సీఎం జగన్ తో పాటు.. ఏపీకి చెందిన మంత్రులు పలువురు మీడియా ముందు అదే పనిగా చెప్పటంతో సామాన్యుల్లోకి ఈ సమాచారం బాగా వెళ్లింది. దీంతో.. వారు రూ.2వేల కోసం అధికారుల్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఆ పేరుతో నిధులు రాలేదని అధికారులు చెబుతున్నా.. బాధితులు మాత్రం వినిపించుకోవటం లేదు.

నిత్యం పలువురి చేత మాట పడాల్సి వస్తోందని వాపోతున్నారు. బాధితులకు ఇస్తానన్న రూ.2వేల విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకొని.. అందుకు తగ్గట్లు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని అధికారులు కోరుతున్నారు. వారి గోడును జగన్ ఎంత త్వరగా ఆలకిస్తే.. అంత త్వరగా ప్రజల చీవాట్ల నుంచి బయటపడతామని అధికారులు పేర్కొంటున్నారు.

This post was last modified on August 28, 2020 11:33 am

Share
Show comments
Published by
Satya
Tags: CoronaJagan

Recent Posts

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

7 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

3 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

5 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

5 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

7 hours ago