ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక మాట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు.. ఆసుపత్రుల వద్ద తరచూ రచ్చ నెలకొంటోంది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాటేనని చెబుతున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఇళ్లకు వెళ్లే వేళలో.. ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2వేల ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.
మొదట్లో రూ.2వేల మొత్తాన్ని ఇచ్చినా.. తర్వాత ఆ విషయాల్ని వదిలేశారు. దీనికి సంబంధించిన నిధులు రాకపోవటంతో.. అధికారులు సైతం గమ్ముగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితులు మాత్రం సీఎం జగనన్న చెప్పిన రూ.2వేలు ఇవ్వరంటూ క్వారంటైన్ సెంటర్ల వద్ద గొడవ పెట్టుకుంటున్నారు. జగనన్న రూ.2వేల ఇవ్వమంటే.. ఇవ్వరా? మీరు తినేశారా? లాంటి ఆగ్రహావేశాల్ని చవిచూడాల్సి వస్తోంది.
రూ.2వేల సాయం గురించి సీఎం జగన్ తో పాటు.. ఏపీకి చెందిన మంత్రులు పలువురు మీడియా ముందు అదే పనిగా చెప్పటంతో సామాన్యుల్లోకి ఈ సమాచారం బాగా వెళ్లింది. దీంతో.. వారు రూ.2వేల కోసం అధికారుల్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఆ పేరుతో నిధులు రాలేదని అధికారులు చెబుతున్నా.. బాధితులు మాత్రం వినిపించుకోవటం లేదు.
నిత్యం పలువురి చేత మాట పడాల్సి వస్తోందని వాపోతున్నారు. బాధితులకు ఇస్తానన్న రూ.2వేల విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకొని.. అందుకు తగ్గట్లు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని అధికారులు కోరుతున్నారు. వారి గోడును జగన్ ఎంత త్వరగా ఆలకిస్తే.. అంత త్వరగా ప్రజల చీవాట్ల నుంచి బయటపడతామని అధికారులు పేర్కొంటున్నారు.
This post was last modified on August 28, 2020 11:33 am
తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…