Political News

ఏపీ అధికారులకు కొత్త తిప్పలు తెస్తున్న జగనన్న రూ.2వేల మాట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక మాట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు.. ఆసుపత్రుల వద్ద తరచూ రచ్చ నెలకొంటోంది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాటేనని చెబుతున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఇళ్లకు వెళ్లే వేళలో.. ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2వేల ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.

మొదట్లో రూ.2వేల మొత్తాన్ని ఇచ్చినా.. తర్వాత ఆ విషయాల్ని వదిలేశారు. దీనికి సంబంధించిన నిధులు రాకపోవటంతో.. అధికారులు సైతం గమ్ముగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితులు మాత్రం సీఎం జగనన్న చెప్పిన రూ.2వేలు ఇవ్వరంటూ క్వారంటైన్ సెంటర్ల వద్ద గొడవ పెట్టుకుంటున్నారు. జగనన్న రూ.2వేల ఇవ్వమంటే.. ఇవ్వరా? మీరు తినేశారా? లాంటి ఆగ్రహావేశాల్ని చవిచూడాల్సి వస్తోంది.

రూ.2వేల సాయం గురించి సీఎం జగన్ తో పాటు.. ఏపీకి చెందిన మంత్రులు పలువురు మీడియా ముందు అదే పనిగా చెప్పటంతో సామాన్యుల్లోకి ఈ సమాచారం బాగా వెళ్లింది. దీంతో.. వారు రూ.2వేల కోసం అధికారుల్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఆ పేరుతో నిధులు రాలేదని అధికారులు చెబుతున్నా.. బాధితులు మాత్రం వినిపించుకోవటం లేదు.

నిత్యం పలువురి చేత మాట పడాల్సి వస్తోందని వాపోతున్నారు. బాధితులకు ఇస్తానన్న రూ.2వేల విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకొని.. అందుకు తగ్గట్లు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని అధికారులు కోరుతున్నారు. వారి గోడును జగన్ ఎంత త్వరగా ఆలకిస్తే.. అంత త్వరగా ప్రజల చీవాట్ల నుంచి బయటపడతామని అధికారులు పేర్కొంటున్నారు.

This post was last modified on August 28, 2020 11:33 am

Share
Show comments
Published by
satya
Tags: CoronaJagan

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago