ముల్లును ముల్లుతోనే తీయాలన్నది రాజనీతి. ఈ నీతిని తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ప్రయోగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అన్న విషయం తెలిసిందే. ఇపుడు అదే గుర్తుతో కేసీయార్ వ్యతిరేక ప్రచారం చేయాలని కాంగ్రెస్ రెడీ అవుతోంది. అది ఎలాగంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 119 కార్లను కాంగ్రెస్ అద్దెకు తీసుకోబోతోంది. వాటిని గులాబీ రంగుతోనే ముస్తాబు చేయబోతోంది. అంటే అప్పుడు ఆ కార్లు చూడడానికి అచ్చం బీఆర్ఎస్ పార్టీ గుర్తులాగే ఉంటుంది.
అయితే దానిపై బైబై కేసీయార్ అనే నినాదాన్ని రాయించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా కారుగుర్తుపై కాళేశ్వరంలో అవినీతి, దళితబంధు, బీసీ బంధు స్కీమ్ ఫెయిల్యూర్, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, రైతు రుణమాఫీలో మోసం పథకాలను, తప్పుడు హామీలను రాయించాలని డిసైడ్ అయ్యిందట. కేసీయార్ వ్యతిరేక స్లోగన్లు రాయించిన కారులో కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన కేసెట్ ను ఏర్పాటు చేయబోతోంది.
అంతా రెడీ అయిన తర్వాత ఆ కారు దానికి కేటాయించిన నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు కార్లు ప్రతిరోజు నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. మామూలు జనాలకు చూసేందుకు బీఆర్ఎస్ గుర్తయిన కారు తిరుగుతున్నట్లే ఉంటుంది. కానీ అందులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటుంది. జనాలను తమ ప్రయోగం బాగా ఆకర్షిస్తుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.
అయితే దీంతో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కారులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? పోలీసులు ఎంత ఎన్నికల కమీషన్ ఆధీనంలో ఉన్నా అధికారపార్టీ నేతలు చెప్పిన మాట వినకుండానే ఉంటారా ? అన్నది పాయింట్. ఏదేమైనా కాంగ్రెస్ ప్రయత్నం ఆచరణలోకి వస్తే కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటో తెలియటం లేదు. ప్లాన్ అయితే బాగానే ఉంది మరి ఫలితమే అనుమానంగా ఉంది.
This post was last modified on November 4, 2023 9:47 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…