Political News

కాంగ్రెస్ పింక్ కార్ ఐడియా

ముల్లును ముల్లుతోనే తీయాలన్నది రాజనీతి. ఈ నీతిని తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ప్రయోగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అన్న విషయం తెలిసిందే. ఇపుడు అదే గుర్తుతో కేసీయార్ వ్యతిరేక ప్రచారం చేయాలని కాంగ్రెస్ రెడీ అవుతోంది. అది ఎలాగంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 119 కార్లను కాంగ్రెస్ అద్దెకు తీసుకోబోతోంది. వాటిని గులాబీ రంగుతోనే ముస్తాబు చేయబోతోంది. అంటే అప్పుడు ఆ కార్లు చూడడానికి అచ్చం బీఆర్ఎస్ పార్టీ గుర్తులాగే ఉంటుంది.

అయితే దానిపై బైబై కేసీయార్ అనే నినాదాన్ని రాయించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా కారుగుర్తుపై కాళేశ్వరంలో అవినీతి, దళితబంధు, బీసీ బంధు స్కీమ్ ఫెయిల్యూర్, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, రైతు రుణమాఫీలో మోసం పథకాలను, తప్పుడు హామీలను రాయించాలని డిసైడ్ అయ్యిందట. కేసీయార్ వ్యతిరేక స్లోగన్లు రాయించిన కారులో కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన కేసెట్ ను ఏర్పాటు చేయబోతోంది.

అంతా రెడీ అయిన తర్వాత ఆ కారు దానికి కేటాయించిన నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు కార్లు ప్రతిరోజు నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. మామూలు జనాలకు చూసేందుకు బీఆర్ఎస్ గుర్తయిన కారు తిరుగుతున్నట్లే ఉంటుంది. కానీ అందులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటుంది. జనాలను తమ ప్రయోగం బాగా ఆకర్షిస్తుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.

అయితే దీంతో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కారులో కేసీయార్ వ్యతిరేక ప్రచారం జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? పోలీసులు ఎంత ఎన్నికల కమీషన్ ఆధీనంలో ఉన్నా అధికారపార్టీ నేతలు చెప్పిన మాట వినకుండానే ఉంటారా ? అన్నది పాయింట్. ఏదేమైనా కాంగ్రెస్ ప్రయత్నం ఆచరణలోకి వస్తే కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటో తెలియటం లేదు. ప్లాన్ అయితే బాగానే ఉంది మరి ఫలితమే అనుమానంగా ఉంది.

This post was last modified on November 4, 2023 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

1 hour ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

2 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

2 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

3 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

4 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

4 hours ago