తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఏపీ పరిరక్షణ సమితి రెడీ అయింది. ఈ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 24 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిలర్లు.. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ పరిరక్షణ సమితి ప్రచారం చేయనుంది.
ఏమిటీ సమితి?
ఏపీ పరిరక్షణ సమితి.. 2021లో ఏర్పడింది. రాజధాని అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎంచుకున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు ఉద్యమబాట పట్టారు. ఈ సమయంలో అన్ని వర్గాల నుంచి రైతులకు మద్దతు లభించింది. ఇలాంటి సమయంలో తాము కూడా చేతులు కలుపుతామంటూ.. కొలికపూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులకు, రాజధానికి మద్దతుగా ఈ సమితి వ్యవహరిస్తోంది.
అమరావతి రైతులు చేసిన పాదయాత్రల్లో ఈ సమితి కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అనేక సందర్భాల్లో నిరసనలు కూడా వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్.. రాజధాని పాదయాత్రను తూర్పుగోదావరిలో నిలిపివేసిన సమయంలో ఒంటరిగా.. నడిచి.. గమ్యాన్ని పూర్తి చేశారు. తర్వాత.. చంద్రబాబుపై కేసులను నిరసిస్తూ.. ఇటీవల కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు పలకాలని నిర్ణయించారు. అయితే.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి.
This post was last modified on November 3, 2023 2:42 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…