తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఏపీ పరిరక్షణ సమితి రెడీ అయింది. ఈ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 24 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిలర్లు.. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ పరిరక్షణ సమితి ప్రచారం చేయనుంది.
ఏమిటీ సమితి?
ఏపీ పరిరక్షణ సమితి.. 2021లో ఏర్పడింది. రాజధాని అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎంచుకున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు ఉద్యమబాట పట్టారు. ఈ సమయంలో అన్ని వర్గాల నుంచి రైతులకు మద్దతు లభించింది. ఇలాంటి సమయంలో తాము కూడా చేతులు కలుపుతామంటూ.. కొలికపూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులకు, రాజధానికి మద్దతుగా ఈ సమితి వ్యవహరిస్తోంది.
అమరావతి రైతులు చేసిన పాదయాత్రల్లో ఈ సమితి కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అనేక సందర్భాల్లో నిరసనలు కూడా వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్.. రాజధాని పాదయాత్రను తూర్పుగోదావరిలో నిలిపివేసిన సమయంలో ఒంటరిగా.. నడిచి.. గమ్యాన్ని పూర్తి చేశారు. తర్వాత.. చంద్రబాబుపై కేసులను నిరసిస్తూ.. ఇటీవల కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు పలకాలని నిర్ణయించారు. అయితే.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి.
This post was last modified on November 3, 2023 2:42 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…