Political News

తెలంగాణ కాంగ్రెస్‌కు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మ‌ద్ద‌తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి రెడీ అయింది. ఈ స‌మితి అధ్య‌క్షుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తామ‌ని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిల‌ర్లు.. ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీ ప‌రిర‌క్ష‌ణ సమితి ప్ర‌చారం చేయ‌నుంది.

ఏమిటీ స‌మితి?

ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి.. 2021లో ఏర్ప‌డింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల నినాదం ఎంచుకున్న నేప‌థ్యంలో ఇక్క‌డి రైతులు ఉద్య‌మబాట ప‌ట్టారు. ఈ స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల నుంచి రైతుల‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఇలాంటి స‌మ‌యంలో తాము కూడా చేతులు క‌లుపుతామంటూ.. కొలిక‌పూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి రైతుల‌కు, రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా ఈ స‌మితి వ్య‌వ‌హ‌రిస్తోంది.

అమ‌రావ‌తి రైతులు చేసిన పాద‌యాత్ర‌ల్లో ఈ స‌మితి కీల‌క పాత్ర పోషించింది. అదేస‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను నిరసిస్తూ.. అనేక సంద‌ర్భాల్లో నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్‌.. రాజ‌ధాని పాద‌యాత్రను తూర్పుగోదావ‌రిలో నిలిపివేసిన స‌మ‌యంలో ఒంట‌రిగా.. న‌డిచి.. గ‌మ్యాన్ని పూర్తి చేశారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబుపై కేసుల‌ను నిర‌సిస్తూ.. ఇటీవ‌ల కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్ష‌లు చేశారు. ఇప్పుడు తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో.. చూడాలి.

This post was last modified on November 3, 2023 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago