తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఏపీ పరిరక్షణ సమితి రెడీ అయింది. ఈ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 24 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిలర్లు.. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ పరిరక్షణ సమితి ప్రచారం చేయనుంది.
ఏమిటీ సమితి?
ఏపీ పరిరక్షణ సమితి.. 2021లో ఏర్పడింది. రాజధాని అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎంచుకున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు ఉద్యమబాట పట్టారు. ఈ సమయంలో అన్ని వర్గాల నుంచి రైతులకు మద్దతు లభించింది. ఇలాంటి సమయంలో తాము కూడా చేతులు కలుపుతామంటూ.. కొలికపూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులకు, రాజధానికి మద్దతుగా ఈ సమితి వ్యవహరిస్తోంది.
అమరావతి రైతులు చేసిన పాదయాత్రల్లో ఈ సమితి కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అనేక సందర్భాల్లో నిరసనలు కూడా వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్.. రాజధాని పాదయాత్రను తూర్పుగోదావరిలో నిలిపివేసిన సమయంలో ఒంటరిగా.. నడిచి.. గమ్యాన్ని పూర్తి చేశారు. తర్వాత.. చంద్రబాబుపై కేసులను నిరసిస్తూ.. ఇటీవల కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు పలకాలని నిర్ణయించారు. అయితే.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి.
This post was last modified on November 3, 2023 2:42 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…