ఏపీ సీఐడీ అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై అసహనం వ్యక్తం చేసింది. “ప్రతివాదిపై(చంద్రబాబు) మీరు పెట్టాలని కోరుతున్న షరతులు ఎందుకో మాకు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది మౌనం వహించారు.
ఏం జరిగింది?
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం తెలిసిందే. అయితే.. 52 రోజలు తర్వాత.. ఆయనకు హైకోర్టు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని షరతులు కూడా విధించింది. అంతేకాదు.. ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తప్పు చేయను, చేయనివ్వనని వ్యాఖ్యానించారు. ఇక, బాబు విడుదలతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు దారి పొడవునా.. వేచి ఉండి.. అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన అదే రోజు స్పందించిన సీఐడీ.. చంద్రబాబుపై మరో పిటిషన్ను దాఖలు చేసింది.
చంద్రబాబుపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరింది. ఆయన ఎక్కడా మీడియాతో మాట్లాడరాదని, ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, కేవలం వైద్యానికి మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనరాదని, ఆయనను నిరంతరం గమనించేలా ఇద్దరు డీఎస్పీలను నియమిస్తూ ఆదేశించేలా కోరుతూ.. పిటిషన్ వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అదేసమయంలో స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలోనే ఆదేశించామని పేర్కొంది. ఇప్పుడు కొత్తగా సీఐడీ కోరుతున్న షరతుల వెనుక ఉద్దేశం తమకు తెలుసునని వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on November 3, 2023 2:31 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…