Political News

ష‌ర్మిల మోసం చేసింది.. వైటీపీ నేత‌ల ధ‌ర్నా

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు సొంత పార్టీ నాయకుల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేసేదీ చేయ‌నిదీ.. ష‌ర్మిల స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డం.. నామినేష‌న్ల‌కు గ‌డువు వ‌చ్చేయ‌డం.. మ‌రోవైపు ప్ర‌ధాన పార్టీల‌న్నీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న నేప‌థ్యంలో ష‌ర్మిల పార్టీలో ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది. దీనికితోడు.. భిన్న‌మైన వాద‌న‌ల‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు లీక్ చేస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ష‌ర్మిల పార్టీలోని కొంద‌రు నాయ‌కులు కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. ష‌ర్మిల త‌మ‌ను న‌మ్మించి న‌ట్టేట ముంచింద‌ని వారు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. అస‌లు పార్టీ ఎందుకు పెట్టారో.. చెప్పాలంటూ నిల‌దీశారు. త‌మ‌ను పావులుగా వాడుకుని.. ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని న‌మ్మించి.. ఖ‌ర్చు చేయించి ఇప్పుడు మొహం చాటేస్తారా? అంటూ.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ష‌ర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ రెడీ అయిన‌ట్టు మూడు మాసాల కింద‌ట ప్ర‌చారం చేశారు. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కూడా చెప్పారు. అయితే.. ఇంత‌లోనే.. కాంగ్రెస్‌కు చేరువ‌య్యారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న ఎందుకో ఆగిపోయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామని ప్రకటించారు.

చివరగా గత రెండు రోజుల కింద జరిగిన ఉన్నత స్థాయి కార్యకర్త సమావేశంలో 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. అయితే.. గ‌త సాయంత్రం అంత‌ర్గ‌త స‌మావేశంలో తెలంగాణలో పోటీ చేయ‌డం లేద‌ని పార్టీ ముఖ్య నాయ‌కులు చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో టికెట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారు పార్టీ కార్యాల‌యానికి చేరుకుని ష‌ర్మిల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆగ్రహానికి గురైన వైయస్సార్టీపీ నాయకులు షర్మిల డౌన్ డౌన్.. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మ‌రి వైఎస్ త‌న‌య ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 3, 2023 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

23 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago