వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు సొంత పార్టీ నాయకుల నుంచి భారీ సెగ తగిలింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసేదీ చేయనిదీ.. షర్మిల స్పష్టం చేయకపోవడం.. నామినేషన్లకు గడువు వచ్చేయడం.. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో షర్మిల పార్టీలో ఉలుకు పలుకు లేకుండా పోయింది. దీనికితోడు.. భిన్నమైన వాదనలను పార్టీ కార్యాలయం మీడియాకు లీక్ చేస్తోంది.
ఈ పరిణామాలతో షర్మిల పార్టీలోని కొందరు నాయకులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. షర్మిల తమను నమ్మించి నట్టేట ముంచిందని వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. అసలు పార్టీ ఎందుకు పెట్టారో.. చెప్పాలంటూ నిలదీశారు. తమను పావులుగా వాడుకుని.. ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని నమ్మించి.. ఖర్చు చేయించి ఇప్పుడు మొహం చాటేస్తారా? అంటూ.. కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ రెడీ అయినట్టు మూడు మాసాల కిందట ప్రచారం చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా చెప్పారు. అయితే.. ఇంతలోనే.. కాంగ్రెస్కు చేరువయ్యారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రతిపాదన ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామని ప్రకటించారు.
చివరగా గత రెండు రోజుల కింద జరిగిన ఉన్నత స్థాయి కార్యకర్త సమావేశంలో 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. అయితే.. గత సాయంత్రం అంతర్గత సమావేశంలో తెలంగాణలో పోటీ చేయడం లేదని పార్టీ ముఖ్య నాయకులు చెప్పినట్టు సమాచారం. దీంతో టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు పార్టీ కార్యాలయానికి చేరుకుని షర్మిలపై నిప్పులు చెరుగుతున్నారు. ఆగ్రహానికి గురైన వైయస్సార్టీపీ నాయకులు షర్మిల డౌన్ డౌన్.. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరి వైఎస్ తనయ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 3, 2023 12:29 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…