Political News

ష‌ర్మిల మోసం చేసింది.. వైటీపీ నేత‌ల ధ‌ర్నా

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు సొంత పార్టీ నాయకుల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేసేదీ చేయ‌నిదీ.. ష‌ర్మిల స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డం.. నామినేష‌న్ల‌కు గ‌డువు వ‌చ్చేయ‌డం.. మ‌రోవైపు ప్ర‌ధాన పార్టీల‌న్నీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న నేప‌థ్యంలో ష‌ర్మిల పార్టీలో ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది. దీనికితోడు.. భిన్న‌మైన వాద‌న‌ల‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు లీక్ చేస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ష‌ర్మిల పార్టీలోని కొంద‌రు నాయ‌కులు కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. ష‌ర్మిల త‌మ‌ను న‌మ్మించి న‌ట్టేట ముంచింద‌ని వారు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. అస‌లు పార్టీ ఎందుకు పెట్టారో.. చెప్పాలంటూ నిల‌దీశారు. త‌మ‌ను పావులుగా వాడుకుని.. ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని న‌మ్మించి.. ఖ‌ర్చు చేయించి ఇప్పుడు మొహం చాటేస్తారా? అంటూ.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ష‌ర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ రెడీ అయిన‌ట్టు మూడు మాసాల కింద‌ట ప్ర‌చారం చేశారు. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కూడా చెప్పారు. అయితే.. ఇంత‌లోనే.. కాంగ్రెస్‌కు చేరువ‌య్యారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న ఎందుకో ఆగిపోయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామని ప్రకటించారు.

చివరగా గత రెండు రోజుల కింద జరిగిన ఉన్నత స్థాయి కార్యకర్త సమావేశంలో 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. అయితే.. గ‌త సాయంత్రం అంత‌ర్గ‌త స‌మావేశంలో తెలంగాణలో పోటీ చేయ‌డం లేద‌ని పార్టీ ముఖ్య నాయ‌కులు చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో టికెట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారు పార్టీ కార్యాల‌యానికి చేరుకుని ష‌ర్మిల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆగ్రహానికి గురైన వైయస్సార్టీపీ నాయకులు షర్మిల డౌన్ డౌన్.. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మ‌రి వైఎస్ త‌న‌య ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

44 minutes ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

1 hour ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

1 hour ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

2 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

4 hours ago

3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…

4 hours ago