సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా జగన్ హాజరు కాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని, ఆ పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. జగన్ తో పాటు సీబీఐకి కూడా దేశపు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ పై కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రదర్శించింది. ఆ కారణాలను వెల్లడించాలంటూ సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.
This post was last modified on November 3, 2023 12:27 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…