సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా జగన్ హాజరు కాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని, ఆ పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. జగన్ తో పాటు సీబీఐకి కూడా దేశపు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ పై కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రదర్శించింది. ఆ కారణాలను వెల్లడించాలంటూ సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…