Political News

జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా జగన్ హాజరు కాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని, ఆ పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. జగన్ తో పాటు సీబీఐకి కూడా దేశపు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ పై కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రదర్శించింది. ఆ కారణాలను వెల్లడించాలంటూ సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.

This post was last modified on November 3, 2023 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

9 minutes ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

2 hours ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

4 hours ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

4 hours ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

5 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

5 hours ago