తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ముమ్మరంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్…ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఓటు వేసేముందు ఆలోచించుకోవాలని, ఆ ఓటు మీ కిస్మత్ మారుస్తుందని కేసీఆర్ అన్నారు. అదే ఓటు ప్రజల జీవితాలను తలకిందులు చేయగలదని కేసీఆర్ హెచ్చరించారు. 11 సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఆ పార్టీకి ఇంకో చాన్స్ అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారని, పెట్టుబడి సాయం దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ 5 గంటల విద్యుత్ ఇస్తుంటే తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరం నుంచి రైతుబంధును రూ.12వేలకు పెంచి…క్రమంగా రూ.16వేలు చేస్తామని హామీనిచ్చారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ధర్మపురి అభివృద్ధిపై ఫోకస్ చేయలేదని, ఈశ్వర్ పాలనలో డెవలప్ జరిగిందని చెప్పారు. వాగులపై చెక్ డ్యాంలు కట్టించారని, మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో చిమ్మచీకట్లు, మంచి నీళ్లు, సాగునీళ్లు లేవని, వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారమే అని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదని, సాగునీటి సమస్యను పరిష్కరించుందామని చెప్పారు. 24 గంటల విద్యుత్ లేదని ప్రధాని మోదీ అన్నారని, ఆయనకు ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు.
This post was last modified on November 2, 2023 10:14 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…