Political News

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ రెడీ అయింది.

డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపికలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

ఐఐటీ, హెచ్ సీయూలతోపాటు పలు ప్రముఖ యూనివర్సిటీలోని నిపుణులతో చర్చించి సిలబస్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అయితే, ఏపీపీఎస్సీపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోందని ఏపీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2 విషయంలో 900 ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ల జారీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని, వాటిని ఏపీపీఎస్సీ ఖండిస్తుందని ప్రకటించింది. అటువంటి కథనాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఈ నెలలోనే మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

This post was last modified on November 2, 2023 8:40 pm

Share

Recent Posts

యష్ &  విశాల్… ఇన్ని పోలికలున్నాయా

సరిగ్గా పన్నెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న టాక్సిక్, మకుటం కొన్ని విషయాల్లో చాలా సారూప్యతలు చూపిస్తున్నాయి. మొదటిది…

1 hour ago

ఈసారి అసెంబ్లీకి రాకపోతే కష్టమే జగన్

రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు…

5 hours ago

టాక్సిక్ విధ్వంసం 191 నిమిషాలు ?

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…

7 hours ago

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విద్యార్థుల సెగ‌.. కేంద్రం మౌనం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంటే.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి అంత‌టి పోస్టు. ఈ ప‌ద‌వికి అనేక మంది వ‌న్నె తెచ్చారు.…

7 hours ago

‘వందేమాత‌రం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం

మ‌రో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…

7 hours ago

పెనిమిటి కోసం తగ్గేదెలే అంటున్న రష్మిక

అన్ని అనుకున్న టైంకి జరిగి ఉంటే విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయ్యేది. అయితే ఇంకా…

8 hours ago