ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ రెడీ అయింది.
డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపికలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఐఐటీ, హెచ్ సీయూలతోపాటు పలు ప్రముఖ యూనివర్సిటీలోని నిపుణులతో చర్చించి సిలబస్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అయితే, ఏపీపీఎస్సీపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోందని ఏపీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2 విషయంలో 900 ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ల జారీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని, వాటిని ఏపీపీఎస్సీ ఖండిస్తుందని ప్రకటించింది. అటువంటి కథనాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఈ నెలలోనే మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
This post was last modified on November 2, 2023 8:40 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…