ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ రెడీ అయింది.
డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపికలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఐఐటీ, హెచ్ సీయూలతోపాటు పలు ప్రముఖ యూనివర్సిటీలోని నిపుణులతో చర్చించి సిలబస్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అయితే, ఏపీపీఎస్సీపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోందని ఏపీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2 విషయంలో 900 ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ల జారీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని, వాటిని ఏపీపీఎస్సీ ఖండిస్తుందని ప్రకటించింది. అటువంటి కథనాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఈ నెలలోనే మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
This post was last modified on November 2, 2023 8:40 pm
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…