ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని హామీలు నెరవేర్చేందుకు అధికార పార్టీ సన్నాహాలు మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ నడుం బిగించింది తాజాగా 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ రెడీ అయింది.
డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపికలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఐఐటీ, హెచ్ సీయూలతోపాటు పలు ప్రముఖ యూనివర్సిటీలోని నిపుణులతో చర్చించి సిలబస్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అయితే, ఏపీపీఎస్సీపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోందని ఏపీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2 విషయంలో 900 ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 1 గ్రూప్ నోటిఫికేషన్ల జారీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని, వాటిని ఏపీపీఎస్సీ ఖండిస్తుందని ప్రకటించింది. అటువంటి కథనాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఈ నెలలోనే మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
This post was last modified on November 2, 2023 8:40 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…