Political News

గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ జోరు.. మారుతున్న తెలంగాణ పాలిటిక్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల క‌న్నా.. గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు ఎక్కువ‌. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితాలోనూ గ్రామీణ ఓటరు చైత‌న్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌ధాన పార్టీలు గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ద‌ళిత బంధు, రైతు బంధు, 9 గంట‌ల విద్యుత్ వంటి వాటిని ప్ర‌ధాన ఎన్నికల అస్త్రాలుగా చేసుకుంది.

ఇక‌, కీల‌క‌మైన మ‌రో పార్టీ కాంగ్రెస్ కూడా గ్రామీణ స్థాయిలో దూకుడు పెంచింది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఫైర్ బ్రాండ్ల‌ను రంగంలోకి దింపిన కాంగ్రెస్‌.. గ్రామాల్లో మాత్రం ఇంటింటి ప్ర‌చారం.. స్థానిక స‌మ‌స్య‌లు.. రైతులు, రైతు కూలీలు.. ఇలా స్థానికంగా ఉన్న స‌మస్య‌ల‌పై దృష్టి పెట్టింది. అదేవిధంగా మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, ఆరు గ్యారెంటీల‌ను నాయ‌కులు పూస గుచ్చిన‌ట్టు వివ‌రిస్తున్నారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల‌పై నేత‌లు ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ అన్ని గ్రామాల‌నూ క‌వ‌ర్ చేసేలా నాయ‌కులకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా మ‌హిళా ఓటుబ్యాంకును క‌వ‌ర్ చేసేలా నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్క ఛాన్స్‌, తెలంగాణ ఇచ్చింది మేమే అన్న సెంటిమెంటును కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్ ట‌చ్ చేయ‌ని గ్రామాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తూ.. గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచారు.

దీంతో తెలంగాణ రాజ‌కీయాల ముఖ చిత్రం గ్రామీణ స్థాయిలో మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల్లోప‌ట్ట‌ణ ఓట‌రు ప‌రిస్థితిని బ‌ట్టి పోలింగ్‌బూత్‌కు వ‌స్తాడు. కానీ, గ్రామాల్లో అయితే.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గ‌త ఎన్నిక‌ల లెక్క‌ల‌ను కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న కాంగ్రెస్ గ్రామాల‌పై ప‌ట్టు బిగించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నందున ఈ దూకుడు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు కూడా అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి గ్రామీణ ఓటు ఎవరికి జై కొడుతుందో చూడాలి.

This post was last modified on November 2, 2023 2:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago