Political News

బీఆర్ఎస్ ఎంపీ పై దాడి ఎందుకు చేసాడో తెలిసిపోయింది

ఆరు రోజుల క్రితం దుబ్బాక ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిపై ఒక యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనకు రాజకీయాలతో సంబంధంలేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని సిద్ధిపేట పోలీసు కమీషనర్ శ్వేత స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక ఎంఎల్ఏగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాకరరెడ్డి ప్రచారంలో ఉండగా ఒక యువకుడు కత్తితో దాడిచేశాడు. ఆ దాడిలో ఎంపీకి పొత్తికడుపులో తీవ్రంగా గాయమైంది. ఇపుడు ఆసుపత్రి ఐసీయూలో ఉండి వైద్యం చేయించుకుంటున్నారు.

ఎంపీపై ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే కేసీయార్, కేటీయార్ మాట్లాడుతు కాంగ్రెస్ పై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ హత్యారాజీకాయాలకు పాల్పడుతున్నట్లు బహిరంగసభల్లోనే నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు జరిగిన దాడిలో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. దాడిచేసిన యువకుడిపై కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు.

రేవంత్ ఇంతచెప్పినా కేసీయార్, కేటీయార్ వినిపించుకోలేదు. దాడి విషయాన్ని పదేపదే బహిరంగసభల్లో ప్రస్తావిస్తునే ఉన్నారు. అలాంటిది ఇపుడు కమీషనర్ శ్వేత మాట్లాడుతు కేవలం సెన్సేషనల్ అవ్వటానికే తాను కత్తితో దాడిచేసినట్లు గట్టని రాజు చెప్పినట్లు చెప్పారు. అంటే రాజు దాడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని కమీషనర్ మాటల్లోనే తేలిపోయింది. రాజు చేసిన దాడికి రాజకీయాలకు సంబంధంలేనపుడు ఇక కాంగ్రెస్ దాడి చేయించిందని చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోయినట్లే.

జరిగిన దాడిని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పైన బురదచల్లటానికి మాత్రమే కేసీయార్, కేటీయార్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలిసిపోతోంది. అనసరంగా కాంగ్రెస్ మీద హత్యారాజకీయాలంటు ఆరోపణలు చేసిన తండ్రి, కొడుకులు ఇపుడు ఏమి సమాధానం చెబుతారో చూడాలి. బట్టకాల్చటం ప్రత్యర్ధుల మీదకు విసిరేయటంలో కేసీయార్, కేటీయార్ కు మించిన వాళ్ళు లేరు. తమలో ఎన్నితప్పులున్నా వాటిని కప్పిపుచ్చుకుని ఎదురు దాడులు చేయటంలో వీళ్ళు ఆరితేరిపోయారు. మరి ఎంపీపైన దాడిని, తమపై చేసిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

This post was last modified on November 2, 2023 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

7 minutes ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

3 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

3 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

3 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

4 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

4 hours ago