Political News

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు, నేతలు టీడీపీని వదిలేసి బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు.

మేనమామ దేవేందర్ గౌడ్ ద్వారా పార్టీలో చేరారు. దేవేందర్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. తెలంగాణాలోని నేతల్లో చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో ఈయన కూడా ఒకరు. కాసానికి ముందే అరవింద్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలని అనుకున్నా అనేక కారణాలను భేరీజు వేసిన చంద్రబాబు చివరకు ఈయన్ను పక్కనపెట్టారు. అయితే ఇపుడు కాసాని రాజీనామా చేయటంతో పార్టీ పగ్గాలు ఎవరికో ఒకరికి అప్పగించాల్సిన పరిస్ధితి వచ్చింది.

అందుకనే సుదీర్ఘంగా పార్టీలో ఉన్న, తనకు అత్యంత లాయల్ గా ఉన్న అరవింద్ కు ఇపుడు పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరో ఇద్దరు ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నా అరవింద్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నగరానికే చెందిన అరవింద్ మొదటినుండి టీడీపీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయాల్లో చాలాసార్లు అసెంబ్లి టికెట్ కోసం పరిశీలించటం తర్వాత ఏదో కారణంతో పక్కనపెట్టేయటం రివాజుగా మారింది. ఇంత జరిగినా అరవింద్ మాత్రం పార్టీని వదిలిపెట్టలేదు.

నిజానికి రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్న కొందరు నేతలు, క్యాడర్ చాలా డీలా పడ్డారనే చెప్పాలి. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసిన కారణం కూడా ఇదే. గడచిన ఏడాది కాలంగా కాసాని పార్టీలో పూర్తి యాక్టివ్ గా పనిచేసిన కారణం ఏమిటంటే తనతో పాటు తన కొడుకు కూడా అసెంబ్లీకి పోటీచేసి గెలవాలనే. మరిపుడు డీలాపడిన పార్టీని బలోపేతం చేయటానికే అరవింద్ పగ్గాలు అప్పగించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on November 2, 2023 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago