Political News

కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుందట. ఎంఐఎంకు 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది.

బీఆర్ఎస్ కు 41% ఓట్లు పడతాయని, కాంగ్రెస్ కు 34 శాతం ఓట్లు, బిజెపికి 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా 1,20,000 శాంపిళ్లను తీసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించామని ఆ సంస్థ వెల్లడించింది. 2015, 2016, 2017లో ఉత్తర ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ సంస్థ సర్వే ఫలితాలు దాదాపుగా మ్యాచ్ కావడం విశేషం.

కాగా, దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ నిషేధం విధించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేసిన కొన్ని సంస్థలు తమ నివేదికలను ఏడో తేదీ లోపు బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా జనతా కా మూడ్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

Satya

Recent Posts

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

39 seconds ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

56 minutes ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

2 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

3 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

3 hours ago

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

4 hours ago