Political News

కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుందట. ఎంఐఎంకు 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది.

బీఆర్ఎస్ కు 41% ఓట్లు పడతాయని, కాంగ్రెస్ కు 34 శాతం ఓట్లు, బిజెపికి 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా 1,20,000 శాంపిళ్లను తీసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించామని ఆ సంస్థ వెల్లడించింది. 2015, 2016, 2017లో ఉత్తర ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ సంస్థ సర్వే ఫలితాలు దాదాపుగా మ్యాచ్ కావడం విశేషం.

కాగా, దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ నిషేధం విధించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేసిన కొన్ని సంస్థలు తమ నివేదికలను ఏడో తేదీ లోపు బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా జనతా కా మూడ్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

This post was last modified on November 1, 2023 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago