Political News

కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుందట. ఎంఐఎంకు 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది.

బీఆర్ఎస్ కు 41% ఓట్లు పడతాయని, కాంగ్రెస్ కు 34 శాతం ఓట్లు, బిజెపికి 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా 1,20,000 శాంపిళ్లను తీసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించామని ఆ సంస్థ వెల్లడించింది. 2015, 2016, 2017లో ఉత్తర ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ సంస్థ సర్వే ఫలితాలు దాదాపుగా మ్యాచ్ కావడం విశేషం.

కాగా, దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ నిషేధం విధించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేసిన కొన్ని సంస్థలు తమ నివేదికలను ఏడో తేదీ లోపు బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా జనతా కా మూడ్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

This post was last modified on November 1, 2023 9:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

3 mins ago

కల్కి పబ్లిసిటీకి పక్కా ప్రణాళికలు

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…

2 hours ago

దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…

3 hours ago

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం…

8 hours ago

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల…

14 hours ago

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…

15 hours ago