Political News

ఒక రోడ్డు వేస్తే ఏపీ.. రెండు రోడ్లేస్తే తెలంగాణ‌: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తొలిసారి బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. ఏపీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేద‌ని.. తెలంగాణ అభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంద‌ని ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. “ఒక రోడ్డు వేస్తే.. దానిని ఏపీ అంటారు. రెండు రోడ్లు వేస్తే.. అది తెలంగాణ‌”-అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీలో ప్ర‌స్తుతం చీక‌ట్లు అలుముకున్నాయ‌ని చెప్పారు. కానీ, ప‌సిమొగ్గ‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగులు విర‌జిమ్ముతోంద‌ని తెలిపారు. తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా(ఏపీ స‌రిహ‌ద్దు)లోని స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ నిర్వ‌హించింది.

ఈ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. ఏపీ అభివృద్ధికి-తెలంగాణ అభివృద్ధికి లింకు పెట్టి మాట్లాడారు. “ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి. డబుల్‌ రోడ్‌ వస్తే తెలంగాణ‌.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఏపీ” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. “సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. సత్తుపల్లిలో 70 వేల మెజార్టీతో సండ్ర వెంక‌ట వీరయ్య‌ గెలుపు ఖాయమైంది. ఎన్నికలు చాలా వస్తాయి.. పోతాయి.. నిలబడే అభ్యర్థి ఎవరు.. అతని పార్టీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి” అని ఇక్క‌డి వారికి కేసీఆర్ పిలుపునిచ్చారు.

కిర‌ణ్ చెప్పింది జ‌రుగుతోందా?
తెలంగాణ వ‌స్తే.. చీక‌ట్లు క‌మ్ముకుంటాయ‌ని.. నీటికోసం యుద్ధాలు జరుగుతాయ‌ని తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో అడ్డం చెప్పిన అప్ప‌టి ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి చెప్పింది జ‌రుగుతోందా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. “నాడు క‌ర్ర ప‌ట్టుకుని ఉటాయించిండు. తెలంగాణ రాకుండా అడ్డువ‌డిండు. కానీ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. నాడు క‌రెంటు రాద‌ని, నీళ్ల కోసం కొట్లాట‌లు జ‌రుగుతాయ‌న్న కిరణ్‌కుమార్ ఎక్క‌డున్న‌డు” అంటూ.. కేసీఆర్ ఎద్దేవా చేశారు.

ద‌ళితుల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకునే ద‌ళిత బంధును తీసుకువ‌చ్చిన‌ట్టు కేసీఆర్ చెప్పారు. గ‌తంలో అన్ని పార్టీలూ ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగానే చూశాయ‌ని, వాడుకున్నాయ‌ని చెప్పారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. అందుకే ద‌ళిత బంధును తీసుకువ‌చ్చామ‌ని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని కేసీఆర్ ఉద్ఘాటించారు.

This post was last modified on November 1, 2023 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago