అయితే కేసీఆర్తో కాదంటే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకునేందుకు ఆది నుంచి ప్రయత్నించిన కమ్యూనిస్టులకు చివరి నిముషంలో ఇరు పక్షాల నుంచి భంగపాటే ఎదరైంది. అటు కేసీఆర్ ఉలకలేదు.. పలకలేదు. మునుగోడులో కమ్యూనిస్టులు సహకరించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కలసి వెళ్లాలని అనుకున్నారు. అయితే.. కేసీఆర్ చివరకు హ్యాండిచ్చారు. ఇక, తర్వాత అంకంలోకి కాంగ్రెస్ వచ్చినా.. ఆ పార్టీ కూడా కమ్యూనిస్టులతో పొత్తులకు రెడీ కాలేదు. దీంతో ఇప్పుడు తప్పని సరి పరిస్థితిలో కమ్యూనిస్టులు ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు.
ఇందులోనూ సీపీఎం,సీపీఐలు ఎవరికి వారుగా పోటీ పడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లాలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. సత్తుపల్లి మినహా ఖమ్మం, వైరా, మధిర, పాలేరులో సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపేందుకు జిల్లా కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కీలకమైన పాలేరు నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే పాలేరులోని నాలుగు మండలాల్లో ఆయా మండల కమిటీల సమావేశాలు జరిగాయి. ఇక, పాలేరు, ఖమ్మం లాంటి ప్రతిష్టాత్మకమైన జనరల్ స్థానాల్లో సీపీఎం రాష్ట్ర స్థాయిలోని ముఖ్యనాయకులు పోటీ చేస్తే పార్టీకి పటిష్ఠమైన ఓటు బ్యాంకు దక్కుతుందని కామ్రెడ్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు కీలక నేతల అన్వేషణ సాగుతోంది. ఇక, సీపీఐ కూడా తన దారిలో తాను ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇల్లెందు, సత్తుపల్లిలో సీపీఐ వంటరి పోరుకు రెడీ అవుతున్నట్టు కమ్యూనిస్టులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎంతనేది తేలిపోతుందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్న కమ్యూనిస్టులు తర్వాత తర్వాత పలచనబడ్డారనే టాక్ ఉంది. ఇక, ఇతర పార్టీలతో పొత్తులకు ప్రయత్నించి.. కేడర్లోనూ అసహనం సృష్టించారు. దీంతో ఒంటరిపోరుతో ఏమేరకు లబ్ధి పొందుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఒంటరి పోరు కమ్యూనిస్టులకు మేలు చేసినా.. చేయకపోయినా.. ప్రధానపార్టీల ఓట్లు చీల్చడం ఖాయమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on November 1, 2023 11:04 am
టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రచ్చకు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈయన తమిళనాడుకు ఇంచార్జ్ గవర్నర్గా…
దేశంలో ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామని పదే పదే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్కడా కనిపించడం…
పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.…
వరస డిజాస్టర్ల దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూ దర్శకులను నమ్మి…