రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఉండవల్లికి బయలు దేరారు. చంద్రబాబు జడ్ + కేటగిరీ భద్రతలో ఉండడంతో ఆ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, పార్టీ నాయకుల పిలుపు మేరకు ఎక్కడికక్కడ ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బారులు తీరారు.
రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబును చూడగానే జై బాబు నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. పోలీసుల ఆంక్షలను ఛేధించుకొని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు జైలు వద్దే ఆయనకు ఘనంగాస్వాగతం పలికారు. 52 రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడు పై ఉప్పొంగిన అభిమానంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు వస్తున్న కాన్వాయ్ రోడ్ మ్యాప్ మేరకు దారిపొడవునా చంద్రబాబును చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రాజమండ్రి సహా కాన్వాయ్ ప్రయాణించే ప్రధాన రహదారులపై టీడీపీ నాయకులు భారీ ఎత్తున బ్యానర్లు కట్టారు. అంతేకాదు.. ప్రధాన కూడళ్లలో వందల సంఖ్యలో అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. చంద్రబాబు నినాదాలతో రావుల పాలెం సెంటర్ మార్మోగింది. ఇక, తాడేపల్లి, భీమడోలు, దెందులూరు, ఏలూరు, గన్నవరం, విజయవాడల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం. బాస్ ఈజ్ బ్యాక్ నినాదాలతో హోరెత్తించడంతోపాటు.. జై బాబు నినాదాలు చేస్తున్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…