Political News

మద్యం కేసులోనూ చంద్రబాబు అరెస్టుకు హైకోర్టు నో

53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేవలం చికిత్స కోసం కండిషనల్ బెయిల్ మంజూరు చేశామని పలు షరతులను చంద్రబాబుకు హైకోర్టు విధించింది. మరోవైపు, మద్యం షాపుల కేటాయింపులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ముందస్గు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబుకు మరో ఊరటనిచ్చింది. చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. అయితే, స్కిల్ కేసులో హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ చంద్రబాబును మరే కేసులోనూ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు.

ఈ కేసులో నవంబర్ 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. అప్పటివరకు వేరే ఏ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని, హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని చెప్పారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది. కాగా, చంద్రబాబుపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాజాగా మద్యం అంశంలో ఏదో జరిగిందంటూ మరో కేసు పెట్టారని ధూళిపాళ్ల ఆరోపణలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. దానిని బట్టి ఇది కావాలని పెట్టిన కేసు అని అర్థమవుతోందని స్పష్టం చేశారు.

This post was last modified on October 31, 2023 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago