Political News

మద్యం కేసులోనూ చంద్రబాబు అరెస్టుకు హైకోర్టు నో

53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేవలం చికిత్స కోసం కండిషనల్ బెయిల్ మంజూరు చేశామని పలు షరతులను చంద్రబాబుకు హైకోర్టు విధించింది. మరోవైపు, మద్యం షాపుల కేటాయింపులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ముందస్గు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబుకు మరో ఊరటనిచ్చింది. చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. అయితే, స్కిల్ కేసులో హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ చంద్రబాబును మరే కేసులోనూ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు.

ఈ కేసులో నవంబర్ 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. అప్పటివరకు వేరే ఏ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని, హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని చెప్పారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది. కాగా, చంద్రబాబుపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాజాగా మద్యం అంశంలో ఏదో జరిగిందంటూ మరో కేసు పెట్టారని ధూళిపాళ్ల ఆరోపణలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. దానిని బట్టి ఇది కావాలని పెట్టిన కేసు అని అర్థమవుతోందని స్పష్టం చేశారు.

This post was last modified on October 31, 2023 4:37 pm

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

7 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

7 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago