టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కథే నడిచిందన్నారు. దీనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా ఆయన పేర్కొన్నారు. “సీఎం జగన్ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాటకంలో చంద్రబాబు పావుగా మారారు” అని కేవీపీ అన్నారు.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్దల వ్యూహం ఉందని, అయితే.. దీనిపై మాట్లాడేందుకు కొందరికి ధైర్యం సరిపోవడం లేదని కేవీపీ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఈ దుశ్చర్యకు దిగిందని కేవీపీ చెప్పారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసిదేనని, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. అనేక రోజుల నిరీక్షణ తరవాత టీడీపీ యువనేత నారా లోకేష్కు హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని కేవీపీ విమర్శించారు.
మద్యం వద్దని.. ఆదాయం ముద్దని!
సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత.. మరోమాటా మాట్లాడుతున్నారని కేవీపీ విమర్శించారు. అన్ని వర్గాలను ఆయన అథోగతి పాలు చేశారని.. ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేరని కేవీపీ చెప్పారు. రైతులు లబోదిబోమంటున్నా.. సీఎంకు చీమకుట్టినట్టు లేదన్నారు. ఇక, మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్.. దాని ఆదాయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
“మద్యం వద్దన్న జగనే.. ఇప్పుడు దానిపై వచ్చే ఆదాయంతో ఆనందం పొందుతున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని, ఈ విక్రయాల్లో నగదే ఎందుకు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోపణలు వచ్చినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
This post was last modified on October 31, 2023 2:32 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…