టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కథే నడిచిందన్నారు. దీనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా ఆయన పేర్కొన్నారు. “సీఎం జగన్ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాటకంలో చంద్రబాబు పావుగా మారారు” అని కేవీపీ అన్నారు.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్దల వ్యూహం ఉందని, అయితే.. దీనిపై మాట్లాడేందుకు కొందరికి ధైర్యం సరిపోవడం లేదని కేవీపీ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఈ దుశ్చర్యకు దిగిందని కేవీపీ చెప్పారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసిదేనని, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. అనేక రోజుల నిరీక్షణ తరవాత టీడీపీ యువనేత నారా లోకేష్కు హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని కేవీపీ విమర్శించారు.
మద్యం వద్దని.. ఆదాయం ముద్దని!
సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత.. మరోమాటా మాట్లాడుతున్నారని కేవీపీ విమర్శించారు. అన్ని వర్గాలను ఆయన అథోగతి పాలు చేశారని.. ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేరని కేవీపీ చెప్పారు. రైతులు లబోదిబోమంటున్నా.. సీఎంకు చీమకుట్టినట్టు లేదన్నారు. ఇక, మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్.. దాని ఆదాయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
“మద్యం వద్దన్న జగనే.. ఇప్పుడు దానిపై వచ్చే ఆదాయంతో ఆనందం పొందుతున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని, ఈ విక్రయాల్లో నగదే ఎందుకు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోపణలు వచ్చినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…