వైసీపీ పాలనను పొగుడుతూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, వైసీపీలో వీవీ లక్ష్మీ నారాయణ చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై ఆయన క్లారిటీనిచ్చారు. ఆ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ఇటువంటి ప్రచారాలపై ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగిస్తానని, వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
శ్రీశైలంలో తన బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోందని, అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు శ్రీశైలంలో పర్యటిస్తున్నారని అన్నారు. దీంతో, ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే ఎమ్మెల్యేను కలిశానని అన్నారు. అదే సమయంలో వైద్య పరీక్షలకు సంబంధించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి తనను ఆయన ఆహ్వానించారని చెప్పారు. ఆ సందర్భంగా వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని చెప్పుకొచ్చారు.
అంతమాత్రానికే తాను వైసీపీలో చేరుతున్నానని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేయబోతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. మరి, ఈ క్లారిటీ తర్వాత వీవీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారన్న ప్రచారానికి తెరపడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక, రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 30, 2023 7:28 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…