బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక శాసనసభ ఎన్నికల బరిలో టికెట్ దక్కించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. దౌల్తాబాద్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పై హఠాత్తుగా రాజు అనే వ్యక్తి దాడి చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును చితకబాది వెంటనే పోలీసులకు అప్పగించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు 6 కుట్లు పడినట్టుగా వైద్యులు చెబుతున్నారు.
ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతలే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on October 30, 2023 3:38 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…