బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక శాసనసభ ఎన్నికల బరిలో టికెట్ దక్కించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. దౌల్తాబాద్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పై హఠాత్తుగా రాజు అనే వ్యక్తి దాడి చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును చితకబాది వెంటనే పోలీసులకు అప్పగించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు 6 కుట్లు పడినట్టుగా వైద్యులు చెబుతున్నారు.
ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతలే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on October 30, 2023 3:38 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…