బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక శాసనసభ ఎన్నికల బరిలో టికెట్ దక్కించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. దౌల్తాబాద్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పై హఠాత్తుగా రాజు అనే వ్యక్తి దాడి చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును చితకబాది వెంటనే పోలీసులకు అప్పగించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు 6 కుట్లు పడినట్టుగా వైద్యులు చెబుతున్నారు.
ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతలే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on October 30, 2023 3:38 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…