Political News

ఒక పిలుపునకు ఇన్ని వేల మందా?

అసలే ఎన్నికల కాలం. నలుగురిని పోగేయాలంటే నానా గడ్డి కరవాలి. వేలాది రూపాయిలు ఖర్చు చేయాలి. కానీ.. ఒక పిలుపుతో.. వేలాది మంది ఒకచోటుకు చేరటం.. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి కార్యక్రమం ‘‘ఐయాం విత్ సీబీఎన్’’ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. దీనికి వేలాది హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినోళ్లలో అత్యధికులు యువత కావటం ఒక ఎత్తు అయితే.. భార్యపిల్లలతో.. పెద్ద వయస్కుల వారితో కళకళలాడింది.

ఈ కార్యక్రమం జెండా.. ఎజెండా ఒక్కటే. జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలిపేందుకు వీలుగా నిర్వహించిన ఈ సభకు గచ్చిబౌలి స్టేడియం నిండిపోవటం ఒక ఎత్తు అయితే.. వాహనాలు పోటెత్తిన కారణంగా ట్రాఫిక్ జాం ఎదురైన పరిస్థితి. సరైన స్పీకర్లు పెద్దగా లేనప్పటికి.. చంద్రబాబుకు తమ సంఘీభావం తెలపాలన్న ఒక్క ఎజెండాకు ఇంతటి స్పందనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామతో పాటు.. సినీ నిర్మాత బండ్ల గణేశ్ తో పాటు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. రోటీన్ పొలిటికల్ పార్టీ సమావేశాలకు భిన్నమైన వాతావరణంలో.. ఒక కుటుంబ గెట్ టు గెదర్ చందంగా మారిన ఈ సభ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు. కానీ.. ఈ తరహా సభ ఇప్పటివరకు నిర్వహించలేదన్నమాట వినిపిస్తోంది.

ఎవరికి వారు చంద్రబాబు విజన్ గురించి.. ఆయన గొప్పతనం గురించి.. ఆయన ముందుచూపు కారణంగా తమ జీవితాల్లో వచ్చిన మార్పు గురించి.. తెలుగుజాతికి చంద్రబాబు చేసిన గొప్పపనుల గురించి కీర్తించిన వైనం సరికొత్త అనుభూతిని కలిగించేలా చేసింది. ఈ సభలో మాట్లాడిన ఒక ప్రముఖుడు అన్నట్లు.. సాధారణంగా ఒక వ్యక్తి గొప్పతనాన్ని అతను పోయిన తర్వాత మాట్లాడతారు. కానీ.. అందుకు భిన్నంగా బతికి ఉన్నప్పుడే ఇంతటి పొగడ్తల్ని సొంతం చేసుకోవటం సీబీఎన్ కు మాత్రమే సొంతమన్న మాట పలువురి నోట వినిపించింది.

This post was last modified on October 30, 2023 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

2 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

52 minutes ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

1 hour ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago