Political News

బాబు కోసం.. ఐటీ ఉద్యోగుల ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ స‌ర్కారు స్కిల్ కేసు న‌మోదు చేయ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌ను జైలు త‌ర‌లించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం 50 రోజుల‌కు పైగానే చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, చంద్ర‌బాబుకు మేలు చేయ‌డ‌మే తెలుసు కానీ.. అవినీతి చేయ‌డం తెలియ‌ని.. ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాబుకు ద‌న్నుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పోరుగు రాష్ట్రాల్లోనూ ఉద్య‌మాలు చేస్తున్నారు. ఆయ‌న మ‌ద్ద‌తుగా అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

తాజాగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మ‌రోసారి ఐటీ ఉద్యోగులు సంఘీభావ స‌భ‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మా నికి ఏపీ నుంచే కాకుండా.. బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.ఇ క‌, నంద‌మూరి కుటుంబం మొత్తం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు, అదేవిధంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్‌ రూబెన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వ‌హించి.. టీడీపీ గీతాల‌ను ఆల‌పించింది. సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్‌తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.

This post was last modified on October 29, 2023 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago