టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సర్కారు స్కిల్ కేసు నమోదు చేయడం, ఆ వెంటనే ఆయనను జైలు తరలించడం తెలిసిందే. ప్రస్తుతం 50 రోజులకు పైగానే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, చంద్రబాబుకు మేలు చేయడమే తెలుసు కానీ.. అవినీతి చేయడం తెలియని.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాబుకు దన్నుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పోరుగు రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన మద్దతుగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మరోసారి ఐటీ ఉద్యోగులు సంఘీభావ సభను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమా నికి ఏపీ నుంచే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఇ క, నందమూరి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు, అదేవిధంగా ఆయనకు మద్దతు తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్ రూబెన్స్ టీమ్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించి.. టీడీపీ గీతాలను ఆలపించింది. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్ఫోన్ల లైటింగ్తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.
This post was last modified on October 29, 2023 9:51 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…