Gorantla Madhav
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు భద్రతపై ఇప్పటికే టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని టిడిపి నేతలు మండిపడ్డారు.
గోరంట్ల మాధవ్ కామెంట్లపై వైసీపీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యలపై స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమని మాధవ్ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ నేతలకు అలా అనిపించి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, గోరంట్ల మాధవ్ ఇచ్చిన వివరణపై టిడిపి నేతలు సంతృప్తి చెందడం లేదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దూషించడం వైసీపీ నేతలకు అలవాటుని, ఆ తర్వాత వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…