Political News

స‌మ‌న్వ‌యమే కీల‌కం.. టీడీపీ-జ‌న‌సేన వ్యూహం ఇదే!

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు టీడీపీ-జ‌న‌సేన‌లు రెడీ అయ్యాయి. ఇప్ప‌టికే పొత్తుల‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌ను ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల నేప‌థ్యంలో కూడా స‌మ‌న్వ‌యం సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ అగ్ర‌నాయ‌కులు గుర్తించారు. ప్ర‌ధానంగా క్షేత్ర‌స్థాయిలో టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త అంత‌గా లేద‌నేది వాస్త‌వం.

పైగా టికెట్ల పోరు కూడా ఈ రెండు పార్టీల మ‌ధ్య స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు త‌మ‌కంటే త‌మ‌కే ద‌క్కాల‌నే భావ‌న ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ టికెట్‌ను ఇద్ద రు టీడీపీ సీనియ‌ర్లు ఆశిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన త‌ర‌ఫున పోతిన మ‌హేష్ ఇక్క‌డి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో వీరి మ‌ధ్య ఎక్క‌డా స‌ఖ్య‌త లేదు.

ఇక‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. ఉభ‌య గోదావ‌రి, ఉమ్మ‌డి కృష్ణాల్లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. కొన్ని చోట్ల జ‌న‌సేన నాయ‌కులు ఒకింత బ‌లంగా ఉండ‌గా.. అలాంటి చోట టీడీపీ స‌హ‌కారం అత్యంత కీల‌కంగా ఉంది. ఇక‌, మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉభ‌య పార్టీలు క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా క‌నిపిస్తోంది. ఇలా.. మొత్తంగా పార్టీల ప‌రంగా క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను ముందుకు క‌ద‌లించ‌డం ఇప్పుడు ప్ర‌ధాన ప‌రిణామం.

ప్ర‌స్తుతం టీడీపీ-జ‌నసేన పార్టీలు.. స‌మ‌న్వ‌య క‌మిటీల స‌మావేశం ఏర్పాటు చేశాయి. ఈ క‌మిటీల‌ను స‌మ‌న్వ‌య ప‌రచ‌డం ద్వారా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను క‌లిసి ముందుకు న‌డిచేలా దిశానిర్దేశం చేయాల‌నేది పార్టీల ప్ర‌ధాన వ్యూహం. ఇదిలావుంటే.. పార్టీల్లో యువత ఎక్కువ‌గా ఉండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిణామాలు ఆస‌క్తిగా మార‌నున్న నేప‌థ్యంలో స‌మ‌న్వ‌య క‌మిటీల ద్వారా పార్టీల‌ను ఏక‌తాటిపైకి న‌డిపించ‌డం సాధ్య‌మైతేనే పొత్తు ఫ‌లించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on October 29, 2023 4:20 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago