Political News

బీఆర్ఎస్ లోకి నాగం?

నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ లో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో తనకు కాకుండా రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంత్రుప్తితో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. కేటీఆర్ తో భేటీ కావడానికి నాగం సిద్ధమవడమే అందుకు రుజువని చెప్పొచ్చు.

2012 ఉప ఎన్నికలు కలుపుకొని నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ బరిలో దిగాలని చూశారు. ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ కు తొలి జాబితాలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం జనార్ధన్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై నాగం తీవ్ర ఆరోపణలు చేశారు.

కానీ ఆ తర్వాత నాగం సైలెంట్ కావడంతో అన్నీ కుదురుకున్నాయనే అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో జాబితా వెల్లడి తర్వాత నాగం మళ్లీ రంగంలోకి దిగారు. పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారనే చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ను కలిసిన తర్వాత.. నాగం కాంగ్రెస్ ను వీడి కారెక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on October 29, 2023 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

5 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago