నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ లో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో తనకు కాకుండా రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంత్రుప్తితో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. కేటీఆర్ తో భేటీ కావడానికి నాగం సిద్ధమవడమే అందుకు రుజువని చెప్పొచ్చు.
2012 ఉప ఎన్నికలు కలుపుకొని నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ బరిలో దిగాలని చూశారు. ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ కు తొలి జాబితాలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం జనార్ధన్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై నాగం తీవ్ర ఆరోపణలు చేశారు.
కానీ ఆ తర్వాత నాగం సైలెంట్ కావడంతో అన్నీ కుదురుకున్నాయనే అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో జాబితా వెల్లడి తర్వాత నాగం మళ్లీ రంగంలోకి దిగారు. పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారనే చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ను కలిసిన తర్వాత.. నాగం కాంగ్రెస్ ను వీడి కారెక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…