వైసీపీ ముఖ్య నాయకుడు, ఆ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి.. బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి మందు తాగుతారేమో.. ఆమెకు కేరాఫ్ లేదు. గతంలో ఆమె ఏమేం పనులు చేశారో.. మాకు అన్నీ తెలుసు. ఆ నీచమైన పనులను బయట పెట్టడం సంస్కారం కాదు కాబట్టి.. ఒక మహిళగా ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది కాబట్టి వాటిని బయట పెట్టడం లేదు. అవన్నీ బయట పెడితే.. పురందేశ్వరి చివరకు ఏం అఘాయిత్యం చేసుకుంటారో కూడా చెప్పడం కష్టం అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
తాజాగా వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయ బస్సు యాత్ర బాపట్ల జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా శనివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనపైనా.. వైసీపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు మిథున్రెడ్డిపైనా గత కొన్నాళ్లుగా పురందేశ్వరి చేస్తున్న లిక్కర్ సిండికేట్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. నాకు కానీ, మిథున్ రెడ్డికి కానీ.. లిక్కర్లో అసలు ఏయే బ్రాండ్లు ఉన్నాయో..ఉంటాయో కూడా తెలియదు. మాకు ఆ వ్యాపారంతో సంబంధం లేదు. కానీ, పురందేశ్వరి మాత్రం ఈ విషయంలో బాగా అనుభవం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె మందు తాగుతారేమో.. కానీ, నేను మందు ముట్టను, కనీసం నాన్ వెజ్ కూడా తినను అని సాయిరెడ్డి అన్నారు.
అంతేకాదు..తమపై ఆరోపణలు చేసే ముందు.. నిజాలు తెలుసుకుని మాట్లాడితే.. పురందేశ్వరి విషయంలో మేం కూడా అలానే వ్యవహరిస్తామని సాయిరెడ్డి అన్నారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. గతంలో కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆమె ఎన్ని చిందులు తొక్కారో మాకు తెలుసు. ఎన్ని నీచమైన పనులు చేశారో కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు బయట పెడితే.. ఆమె ఏమైపోతారో అనే ఆందోళనతో ఓ మహిళగా.. మా పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని బయట పెట్టడం లేదు అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం ఎంపీ స్థానానికి ఇంచార్జిగా ఉన్న భరత్, దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ చేస్తున్న వ్యాపారాలను బయట పెట్టాలా? అని ప్రశ్నించారు. వారిద్దరూ తనపైనా, మిథున్రెడ్డిపైనా చెప్పిన మాటలను పట్టుకుని పురందేశ్వరి విమర్శలు చేయడం తగదన్నారు. ఆమె గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు.. విశాఖ నుంచి పోటీ చేశారు. తర్వాత బీజేపీలోకి వచ్చి రాజంపేట నుంచి పోటీ చేశారు. ఆమెకు అసలు కేరాఫే లేదు. నును రాజ్యసభ సభ్యుడిని నాకు ఒక నియోజకవర్గం ఉండదు. మరి పురందేశ్వరి కూడా అలానే ఉంటారా? కేరాఫ్లేని వ్యక్తిగా ఆమె మా గురించి మాట్లాడడం తగదు.. అని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 28, 2023 11:07 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…