Political News

జ‌న‌సేన‌పై ఏపీ ముద్ర‌.. బెంబేలెత్తుతున్న బీజేపీ నేత‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ.. దానికి త‌గిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తుల విష‌యానికి తెర దీసింది. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీతో పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌లోనూ పొత్తు పెట్టుకుని.. ప‌వ‌న్ ఇమేజ్‌తో కొంత మేర‌కు సెటిల‌ర్ల ఓట్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ వ్యూహం.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను ఢిల్లీకి పిలిపించి మ‌రీ చ‌ర్చించారు. అయితే.. బీజేపీ కేవ‌లం 3 నుంచి 4 స్థానాలే ఇస్తామ‌ని చెప్ప‌డం.. ప‌వ‌న్ 15-20 స్థానాల‌కు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో పొత్తుల లెక్క‌లు కుద‌ర‌లేదు. ఇది లావుంటే.. ప‌వ‌న్ ఎఫెక్ట్‌ను ముందుగానే గుర్తించిన అధికార పార్టీ బీఆర్ ఎస్ నేత‌లు.. అప్పుడే రాజ‌కీయం ప్రారంభించేశారు. ప‌వ‌న్ పార్టీపై ఏపీ ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా బీజేపీ ఒకింత‌ బ‌లంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి, మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్ స‌హా కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోంద‌నే ప్ర‌చారానికి బీఆర్ ఎస్ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తెర‌దీశారు. దీంతో బీజేపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-టీడీపీ కూట‌మిపై కూడా బీఆర్ ఎస్ ఇలానే ప్రచారం చేసి ల‌బ్ధి పొందిన నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌కు ఆ ఎఫెక్ట్ త‌గులుతుంద‌ని వారు భ‌య ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కూకట్‌పల్లిలో బీజేపీ బలంగానే ఉందని, త‌మ‌కు పొత్తుల‌తో ప‌నిలేద‌ని అన్నారు. బీఆర్‌ఎస్‏కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని బలహీనపర్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లిలో బీజేపీని ఎదుర్కొనే శక్తిలేకనే ఇలాంటి ప్రచారంచేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పార్టీ అధిష్టానం ఒక‌టి ఆశిస్తే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రొక‌టి జ‌రుగుతోంద‌ని బీజేపీ నేత‌లు బెంబేలెత్త‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

లాక్కుపోతున్న మ‌లయాళం సినిమా

సినిమాల స‌క్సెస్ రేట్ ప‌డిపోతోందని.. ఒక‌ప్ప‌ట్లా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని ఈ మ‌ధ్య మ‌న ఇండ‌స్ట్రీలో త‌ర‌చుగా ఆవేద‌న స్వ‌రం…

53 minutes ago

OG 2 అనుమానాలు తీరిపోయాయి

గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…

1 hour ago

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

2 hours ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

2 hours ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

3 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

3 hours ago