Political News

జ‌న‌సేన‌పై ఏపీ ముద్ర‌.. బెంబేలెత్తుతున్న బీజేపీ నేత‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ.. దానికి త‌గిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తుల విష‌యానికి తెర దీసింది. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీతో పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌లోనూ పొత్తు పెట్టుకుని.. ప‌వ‌న్ ఇమేజ్‌తో కొంత మేర‌కు సెటిల‌ర్ల ఓట్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ వ్యూహం.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను ఢిల్లీకి పిలిపించి మ‌రీ చ‌ర్చించారు. అయితే.. బీజేపీ కేవ‌లం 3 నుంచి 4 స్థానాలే ఇస్తామ‌ని చెప్ప‌డం.. ప‌వ‌న్ 15-20 స్థానాల‌కు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో పొత్తుల లెక్క‌లు కుద‌ర‌లేదు. ఇది లావుంటే.. ప‌వ‌న్ ఎఫెక్ట్‌ను ముందుగానే గుర్తించిన అధికార పార్టీ బీఆర్ ఎస్ నేత‌లు.. అప్పుడే రాజ‌కీయం ప్రారంభించేశారు. ప‌వ‌న్ పార్టీపై ఏపీ ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా బీజేపీ ఒకింత‌ బ‌లంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి, మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్ స‌హా కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోంద‌నే ప్ర‌చారానికి బీఆర్ ఎస్ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తెర‌దీశారు. దీంతో బీజేపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-టీడీపీ కూట‌మిపై కూడా బీఆర్ ఎస్ ఇలానే ప్రచారం చేసి ల‌బ్ధి పొందిన నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌కు ఆ ఎఫెక్ట్ త‌గులుతుంద‌ని వారు భ‌య ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కూకట్‌పల్లిలో బీజేపీ బలంగానే ఉందని, త‌మ‌కు పొత్తుల‌తో ప‌నిలేద‌ని అన్నారు. బీఆర్‌ఎస్‏కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని బలహీనపర్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లిలో బీజేపీని ఎదుర్కొనే శక్తిలేకనే ఇలాంటి ప్రచారంచేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పార్టీ అధిష్టానం ఒక‌టి ఆశిస్తే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రొక‌టి జ‌రుగుతోంద‌ని బీజేపీ నేత‌లు బెంబేలెత్త‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 28, 2023 1:04 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

4 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

4 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

7 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

8 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

8 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

8 hours ago