తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. దానికి తగిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తుల విషయానికి తెర దీసింది. వాస్తవానికి పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని.. పవన్ ఇమేజ్తో కొంత మేరకు సెటిలర్ల ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ వ్యూహం.
ఈ క్రమంలోనే పవన్ను ఢిల్లీకి పిలిపించి మరీ చర్చించారు. అయితే.. బీజేపీ కేవలం 3 నుంచి 4 స్థానాలే ఇస్తామని చెప్పడం.. పవన్ 15-20 స్థానాలకు పట్టుబడుతుండడంతో పొత్తుల లెక్కలు కుదరలేదు. ఇది లావుంటే.. పవన్ ఎఫెక్ట్ను ముందుగానే గుర్తించిన అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతలు.. అప్పుడే రాజకీయం ప్రారంభించేశారు. పవన్ పార్టీపై ఏపీ ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
తాజాగా బీజేపీ ఒకింత బలంగా ఉన్న కూకట్పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సహా కొన్నినియోజకవర్గాల్లో బీజేపీ ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోందనే ప్రచారానికి బీఆర్ ఎస్ క్షేత్రస్థాయి నాయకులు తెరదీశారు. దీంతో బీజేపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమిపై కూడా బీఆర్ ఎస్ ఇలానే ప్రచారం చేసి లబ్ధి పొందిన నేపథ్యంలో ఇప్పుడు తమకు ఆ ఎఫెక్ట్ తగులుతుందని వారు భయ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో కూకట్పల్లి బీజేపీ నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కాంతారావు సంచలన కామెంట్లు చేశారు. కూకట్పల్లిలో బీజేపీ బలంగానే ఉందని, తమకు పొత్తులతో పనిలేదని అన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని బలహీనపర్చేందుకు బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూకట్పల్లిలో బీజేపీని ఎదుర్కొనే శక్తిలేకనే ఇలాంటి ప్రచారంచేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పార్టీ అధిష్టానం ఒకటి ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మరొకటి జరుగుతోందని బీజేపీ నేతలు బెంబేలెత్తడం గమనార్హం.
This post was last modified on October 28, 2023 1:04 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…