Political News

జ‌న‌సేన‌పై ఏపీ ముద్ర‌.. బెంబేలెత్తుతున్న బీజేపీ నేత‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ.. దానికి త‌గిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తుల విష‌యానికి తెర దీసింది. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీతో పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌లోనూ పొత్తు పెట్టుకుని.. ప‌వ‌న్ ఇమేజ్‌తో కొంత మేర‌కు సెటిల‌ర్ల ఓట్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ వ్యూహం.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను ఢిల్లీకి పిలిపించి మ‌రీ చ‌ర్చించారు. అయితే.. బీజేపీ కేవ‌లం 3 నుంచి 4 స్థానాలే ఇస్తామ‌ని చెప్ప‌డం.. ప‌వ‌న్ 15-20 స్థానాల‌కు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో పొత్తుల లెక్క‌లు కుద‌ర‌లేదు. ఇది లావుంటే.. ప‌వ‌న్ ఎఫెక్ట్‌ను ముందుగానే గుర్తించిన అధికార పార్టీ బీఆర్ ఎస్ నేత‌లు.. అప్పుడే రాజ‌కీయం ప్రారంభించేశారు. ప‌వ‌న్ పార్టీపై ఏపీ ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా బీజేపీ ఒకింత‌ బ‌లంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి, మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్ స‌హా కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోంద‌నే ప్ర‌చారానికి బీఆర్ ఎస్ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తెర‌దీశారు. దీంతో బీజేపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-టీడీపీ కూట‌మిపై కూడా బీఆర్ ఎస్ ఇలానే ప్రచారం చేసి ల‌బ్ధి పొందిన నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌కు ఆ ఎఫెక్ట్ త‌గులుతుంద‌ని వారు భ‌య ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కూకట్‌పల్లిలో బీజేపీ బలంగానే ఉందని, త‌మ‌కు పొత్తుల‌తో ప‌నిలేద‌ని అన్నారు. బీఆర్‌ఎస్‏కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని బలహీనపర్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లిలో బీజేపీని ఎదుర్కొనే శక్తిలేకనే ఇలాంటి ప్రచారంచేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పార్టీ అధిష్టానం ఒక‌టి ఆశిస్తే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రొక‌టి జ‌రుగుతోంద‌ని బీజేపీ నేత‌లు బెంబేలెత్త‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 28, 2023 1:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

2 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

5 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

5 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

6 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

6 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

7 hours ago