టీడీపీలో నూతనోత్తేజం కనిపిస్తోందా? ఆ పార్టీ దూకుడు పెరిగిందా? అంటే.. తాజాగా వెలుగు చూసిన సంఘ టనలు ఔననే సమాధానాన్నే ఇస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు, జైలు పరిణామాల అనంతరం… కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలు స్తబ్దుగా సాగాయి. అయితే, చంద్రబాబు కోసం అంటూ నిరసనలు నిర్వహించారు. దీంతో దాదాపు 40 రోజుల కుపైగానే టీడీపీ ప్రధాన కార్యక్రమాలు గాడితప్పాయి. కానీ, ఇటీవల కాలంలో మళ్లీ ప్రధాన లైన్లోకి పార్టీ వచ్చేసింది.
ముఖ్యంగా ‘నిజం గెలవాలి’ నినాదంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన యాత్ర.. పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకువచ్చినట్టు పార్టీ అభిమానులు.. విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాజకీయమెరుగని భువనేశ్వరి తొలిసారి రోడ్డెక్కారు. ప్రజల మధ్యకువచ్చారు. రాజకీయ ప్రసంగాలు, ఓదార్పు యాత్రలతో జనంలో నిలిచారు. మొదట్లో వీటిని తక్కువగా అంచనా వేసిన వారు.. పెదవి విరిచిన వారు కూడా.. ఇప్పుడు ప్రధానంగా భావిస్తున్నారు.
ఇప్పటి వరకు భువనేశ్వరి మూడు రోజుల పాటు వరుసగా నిజం గెలవాలి! యాత్ర చేశారు. ఈ సందర్భం గా ఆమె నిర్వహించిన సభలకు భారీ ఎత్తున యువత, మహిళలు కూడా తరలి వచ్చారు. తొలుత నారా భువనేశ్వరి.. ఓదార్పు యాత్రల ద్వారా.. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుం బాలను పరామర్శించారు. అదేసమయంలో వారికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇక, నారా భువనమ్మ బయటకు రావడంతో అప్పటి వరకు తెరచాటున ఉన్న కీలక నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకు వచ్చారు.
నారా భువనేశ్వరి కళ్లలో పడాలనో.. లేక పార్టీ కార్యక్రమాల్లో దూకుడుగా ఉన్నామని చెప్పేందుకో.. మొత్తానికి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ పరిణామంతో టీడీపీలో ఉన్న స్తబ్దత మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. సీమ నుంచి శ్రీకాకుళం వరకు నాయకులు ముందుకు వస్తున్నారు. ఏదో ఒక రూపంలో పార్టీ నేతలను ఐక్యం చేసేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికలకు పార్టీకి బలమైన శక్తిగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…