పక్క రాష్ట్రం పంచాయితీ మా దగ్గర ఎందుకు? మీకేమైనా ఉంటే.. మీ రాష్ట్రం వెళ్లి చేసుకోండంటూ సుద్దులు చెప్పే మంత్రి కేటీఆర్ మాటలు.. హరీశ్ కు వర్తించవా? నోరు విప్పితే ఏపీ ప్రస్తావన తీసుకురావటం.. ఏదో ఒక మాట అనటం గులాబీ నేతలకు అలవాటుగా మారింది. తమ అవసరానికి తగ్గట్లు అదే పనిగా ఏపీని.. ఏపీ ప్రజల మనోభావాల్ని దెబ్బ దీసేలా వ్యాఖ్యానించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండి.. మీ రాష్ట్ర రాజకీయం మా రాష్ట్రంలో ఎందుకు చూపిస్తారు? అని చెప్పేటప్పుడు ఏపీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే.. తెలంగాణ రాష్ట్రం మరో అమరావతి అవుతుందన్నారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ లో కూడా బిజినెస్ పడిపోతుందని.. అమరావతిలా మారిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నట్లుగా పేర్కొంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కేసీఆర్ రాకుంటే హైదరాబాద్ కూడా మరో అమరావతిగా మారుతుందని రియాల్టీ వ్యాపారులు మాట్లాడుకుంటున్నట్లుగా తనకు తెలిసిందన్న హరీశ్.. “హైదరాబాద్ డెవలప్ అయిన విషయం పక్క రాష్ట్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు అర్థమైంది కానీ ఇక్కడి వారికి అర్థం కాలేదు. ఇక్కడకు వచ్చిన రజనీకాంత్ మనం హైదరాబాద్ లో ఉన్నామా? న్యూయార్కులో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారు. అక్కడికి రజనీకి అర్థమైంది కానీ ఇక్కడి గజనీలకు అర్థం కాలేదు” అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
తమ రాష్ట్రం బాగుందన్న విషయాన్ని తమ ప్రజలకు.. తమ ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్పుకోలేని మంత్రి హరీశ్.. ఏపీ మీదా.. అమరావతి మీదా నోటికి వచ్చినట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. హరీశ్ లాంటి మాటకారి సైతం అమరావతి పేరు మీద ఓట్ల రాజకీయం చేయటం చూస్తే.. ఏపీని.. ఏపీ మూలాల్ని వదిలేసి.. రాజకీయం చేసే సత్తా లేదన్న అంశం హరీశ్ మాటల్ని చూస్తే అర్థమవుతోంది. ఈ తరహా అతి మాటల కంటే.. తెలంగాణలోనూ.. హైదరాబాద్ లో చేసిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడి.. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి హరీశ్ ఎలా మిస్ అయినట్లు? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on October 28, 2023 11:26 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…