తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో కేవలం ఒకే ఒక్కపేరు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది నాయకులు రెండో జాబితాలో తమ పేరు ఉంటుందని.. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద నియోజకవర్గాలుగా ఉన్న ఆందోల్, మల్కాజిగిరి వంటి వాటిలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్పై ఆశలు భారీ గానే పెట్టుకున్నారు.
అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక్క పేరుతో ఈ జాబితాను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేయడం గమనార్హం. ఈ స్థానం నుంచి ఏపీ మిథున్కుమార్ రెడ్డికి టికెట్ ఖరారైంది. యువ నాయకుడిగా ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న మిథున్.. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.
ఇదిలావుంటే.. ఇప్పటికే రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నవారు తాజాగా విడుదల చేసిన జాబితాపై పెదవి విరిచారు. ఏదో చేస్తారని అనుకుంటే..ఏదో చేశారని.. కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. తొలి జాబితా అనంతరం అభ్యర్థుల అసంతృప్తి పెల్లుబుకడంతో బీజేపీ అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకున్నారని.. అందుకే రెండో జాబితాలోనూ ప్రధానంగా ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరో జాబితాను వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నవంబరు 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
This post was last modified on October 28, 2023 2:38 am
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…