తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో కేవలం ఒకే ఒక్కపేరు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది నాయకులు రెండో జాబితాలో తమ పేరు ఉంటుందని.. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద నియోజకవర్గాలుగా ఉన్న ఆందోల్, మల్కాజిగిరి వంటి వాటిలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్పై ఆశలు భారీ గానే పెట్టుకున్నారు.
అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక్క పేరుతో ఈ జాబితాను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేయడం గమనార్హం. ఈ స్థానం నుంచి ఏపీ మిథున్కుమార్ రెడ్డికి టికెట్ ఖరారైంది. యువ నాయకుడిగా ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న మిథున్.. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.
ఇదిలావుంటే.. ఇప్పటికే రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నవారు తాజాగా విడుదల చేసిన జాబితాపై పెదవి విరిచారు. ఏదో చేస్తారని అనుకుంటే..ఏదో చేశారని.. కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. తొలి జాబితా అనంతరం అభ్యర్థుల అసంతృప్తి పెల్లుబుకడంతో బీజేపీ అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకున్నారని.. అందుకే రెండో జాబితాలోనూ ప్రధానంగా ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరో జాబితాను వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నవంబరు 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…