తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో కేవలం ఒకే ఒక్కపేరు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది నాయకులు రెండో జాబితాలో తమ పేరు ఉంటుందని.. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద నియోజకవర్గాలుగా ఉన్న ఆందోల్, మల్కాజిగిరి వంటి వాటిలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్పై ఆశలు భారీ గానే పెట్టుకున్నారు.
అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక్క పేరుతో ఈ జాబితాను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేయడం గమనార్హం. ఈ స్థానం నుంచి ఏపీ మిథున్కుమార్ రెడ్డికి టికెట్ ఖరారైంది. యువ నాయకుడిగా ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న మిథున్.. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.
ఇదిలావుంటే.. ఇప్పటికే రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నవారు తాజాగా విడుదల చేసిన జాబితాపై పెదవి విరిచారు. ఏదో చేస్తారని అనుకుంటే..ఏదో చేశారని.. కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. తొలి జాబితా అనంతరం అభ్యర్థుల అసంతృప్తి పెల్లుబుకడంతో బీజేపీ అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకున్నారని.. అందుకే రెండో జాబితాలోనూ ప్రధానంగా ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరో జాబితాను వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నవంబరు 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
This post was last modified on October 28, 2023 2:38 am
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…