తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో కేవలం ఒకే ఒక్కపేరు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది నాయకులు రెండో జాబితాలో తమ పేరు ఉంటుందని.. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద నియోజకవర్గాలుగా ఉన్న ఆందోల్, మల్కాజిగిరి వంటి వాటిలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్పై ఆశలు భారీ గానే పెట్టుకున్నారు.
అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక్క పేరుతో ఈ జాబితాను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేయడం గమనార్హం. ఈ స్థానం నుంచి ఏపీ మిథున్కుమార్ రెడ్డికి టికెట్ ఖరారైంది. యువ నాయకుడిగా ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న మిథున్.. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.
ఇదిలావుంటే.. ఇప్పటికే రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నవారు తాజాగా విడుదల చేసిన జాబితాపై పెదవి విరిచారు. ఏదో చేస్తారని అనుకుంటే..ఏదో చేశారని.. కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. తొలి జాబితా అనంతరం అభ్యర్థుల అసంతృప్తి పెల్లుబుకడంతో బీజేపీ అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకున్నారని.. అందుకే రెండో జాబితాలోనూ ప్రధానంగా ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరో జాబితాను వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నవంబరు 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
This post was last modified on October 28, 2023 2:38 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…