తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారు హఠాత్తుగా రాజకీయాల్లో భాగంగా ఊహించని నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారుతోంది. ఇదే ఒరవడిలో ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులారిటీ ఉన్న రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) గులాబీ గూటికి చేరారు. తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే, బిత్తిరి సత్తి బీఆర్ఎస్ చేరిక వెనుక మంత్రి హరీశ్ రావు పెద్ద కసరత్తే చేశారంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి వీర అభిమానిగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ తరుపున టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ తిరిగి సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున గలం వినిపించారు. పైగా తనకు టికెట్ దక్కకపోవడం విషయంలో మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. దీంతో నీలం మధుకు కౌంటర్గా హరీశ్ తనదైన శైలిలో మంత్రాంగం నడిపించారు.
ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన బిత్తిరి సత్తి అలియస్ రవికుమార్కు తెలంగాణ యాస, భాషపై పట్టుండటమే కాకుండా ఇటు టీవీ వీక్షకుల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే నీలం మధు వల్ల కలిగిన నష్టం పూరించుకోవచ్చునని హరీశ్ లెక్కలు వేశారు. ఆయనతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గురువారం భేటీ ఏర్పాటు చేయించారు. అనంతరం నేడు పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ కండువా కప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…