తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారు హఠాత్తుగా రాజకీయాల్లో భాగంగా ఊహించని నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారుతోంది. ఇదే ఒరవడిలో ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులారిటీ ఉన్న రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) గులాబీ గూటికి చేరారు. తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే, బిత్తిరి సత్తి బీఆర్ఎస్ చేరిక వెనుక మంత్రి హరీశ్ రావు పెద్ద కసరత్తే చేశారంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి వీర అభిమానిగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ తరుపున టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ తిరిగి సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున గలం వినిపించారు. పైగా తనకు టికెట్ దక్కకపోవడం విషయంలో మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. దీంతో నీలం మధుకు కౌంటర్గా హరీశ్ తనదైన శైలిలో మంత్రాంగం నడిపించారు.
ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన బిత్తిరి సత్తి అలియస్ రవికుమార్కు తెలంగాణ యాస, భాషపై పట్టుండటమే కాకుండా ఇటు టీవీ వీక్షకుల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే నీలం మధు వల్ల కలిగిన నష్టం పూరించుకోవచ్చునని హరీశ్ లెక్కలు వేశారు. ఆయనతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గురువారం భేటీ ఏర్పాటు చేయించారు. అనంతరం నేడు పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ కండువా కప్పారు.
This post was last modified on October 27, 2023 9:48 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…