Political News

కలెక్టర్లకు జగన్ క్లాస్… ప్రైవేట్ ఆసుపత్రుల దందానే రీజనంట

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట.

ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించినా ఊరుకునేది లేదని కూడా జగన్ ఒకింత సీరియస్ గానే వార్నింగిచ్చారట.

ఇటీవల విజయవాడలో రమేశ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడుస్తున్న స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయిన వ్యవహారంపై వైసీపీ సర్కారు కాస్తంత గట్టిగానే దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ప్రమాదంపై వేగంగా స్పందించిన జగన్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ రమేశ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. రమేశ్ ఆసుపత్రి అధినేత రమేశ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రమేశ్ అరెస్ట్ వాయిదాపడిన… ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గానే ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ చికిత్సల పేరిట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమ దందాను సాగిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ ఆసుపత్రిని సీజ్ అయిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ దందా సాగిస్తున్న ఆసుపత్రులను ఉపేక్షించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారట. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లు పెడతామంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగానే… ముందూవెనుకా చూసుకోకుండా అనుమతులు మంజూరు చేయడం కూడా కుదరదని జగన్ కలెక్టర్లకు సూచించారట.

ఈ విషయంలో ఏమాత్రం తేడాలు జరిగినా బాధ్యత వహించక తప్పదని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోగులకు తక్షణమే చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తంగా కలెక్టర్లకు జగన్ ఓ రేంజిలో క్లాస్ పీకారన్న మాట.

This post was last modified on August 27, 2020 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago