Political News

కలెక్టర్లకు జగన్ క్లాస్… ప్రైవేట్ ఆసుపత్రుల దందానే రీజనంట

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట.

ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించినా ఊరుకునేది లేదని కూడా జగన్ ఒకింత సీరియస్ గానే వార్నింగిచ్చారట.

ఇటీవల విజయవాడలో రమేశ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడుస్తున్న స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయిన వ్యవహారంపై వైసీపీ సర్కారు కాస్తంత గట్టిగానే దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ప్రమాదంపై వేగంగా స్పందించిన జగన్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ రమేశ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. రమేశ్ ఆసుపత్రి అధినేత రమేశ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రమేశ్ అరెస్ట్ వాయిదాపడిన… ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గానే ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ చికిత్సల పేరిట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమ దందాను సాగిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ ఆసుపత్రిని సీజ్ అయిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ దందా సాగిస్తున్న ఆసుపత్రులను ఉపేక్షించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారట. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లు పెడతామంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగానే… ముందూవెనుకా చూసుకోకుండా అనుమతులు మంజూరు చేయడం కూడా కుదరదని జగన్ కలెక్టర్లకు సూచించారట.

ఈ విషయంలో ఏమాత్రం తేడాలు జరిగినా బాధ్యత వహించక తప్పదని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోగులకు తక్షణమే చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తంగా కలెక్టర్లకు జగన్ ఓ రేంజిలో క్లాస్ పీకారన్న మాట.

This post was last modified on August 27, 2020 10:06 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago