Political News

కలెక్టర్లకు జగన్ క్లాస్… ప్రైవేట్ ఆసుపత్రుల దందానే రీజనంట

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట.

ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించినా ఊరుకునేది లేదని కూడా జగన్ ఒకింత సీరియస్ గానే వార్నింగిచ్చారట.

ఇటీవల విజయవాడలో రమేశ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడుస్తున్న స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయిన వ్యవహారంపై వైసీపీ సర్కారు కాస్తంత గట్టిగానే దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ప్రమాదంపై వేగంగా స్పందించిన జగన్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ రమేశ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. రమేశ్ ఆసుపత్రి అధినేత రమేశ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రమేశ్ అరెస్ట్ వాయిదాపడిన… ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గానే ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ చికిత్సల పేరిట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమ దందాను సాగిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ ఆసుపత్రిని సీజ్ అయిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ దందా సాగిస్తున్న ఆసుపత్రులను ఉపేక్షించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారట. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లు పెడతామంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగానే… ముందూవెనుకా చూసుకోకుండా అనుమతులు మంజూరు చేయడం కూడా కుదరదని జగన్ కలెక్టర్లకు సూచించారట.

ఈ విషయంలో ఏమాత్రం తేడాలు జరిగినా బాధ్యత వహించక తప్పదని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోగులకు తక్షణమే చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తంగా కలెక్టర్లకు జగన్ ఓ రేంజిలో క్లాస్ పీకారన్న మాట.

This post was last modified on August 27, 2020 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

48 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

57 minutes ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago