Political News

కలెక్టర్లకు జగన్ క్లాస్… ప్రైవేట్ ఆసుపత్రుల దందానే రీజనంట

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట.

ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించినా ఊరుకునేది లేదని కూడా జగన్ ఒకింత సీరియస్ గానే వార్నింగిచ్చారట.

ఇటీవల విజయవాడలో రమేశ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడుస్తున్న స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయిన వ్యవహారంపై వైసీపీ సర్కారు కాస్తంత గట్టిగానే దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ ప్రమాదంపై వేగంగా స్పందించిన జగన్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులుగా గుర్తిస్తూ రమేశ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. రమేశ్ ఆసుపత్రి అధినేత రమేశ్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రమేశ్ అరెస్ట్ వాయిదాపడిన… ఈ వ్యవహారంపై జగన్ సర్కారు సీరియస్ గానే ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో కోవిడ్ చికిత్సల పేరిట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమ దందాను సాగిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ ఆసుపత్రిని సీజ్ అయిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ దందా సాగిస్తున్న ఆసుపత్రులను ఉపేక్షించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారట. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లు పెడతామంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగానే… ముందూవెనుకా చూసుకోకుండా అనుమతులు మంజూరు చేయడం కూడా కుదరదని జగన్ కలెక్టర్లకు సూచించారట.

ఈ విషయంలో ఏమాత్రం తేడాలు జరిగినా బాధ్యత వహించక తప్పదని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోగులకు తక్షణమే చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ కలెక్టర్లకు జగన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తంగా కలెక్టర్లకు జగన్ ఓ రేంజిలో క్లాస్ పీకారన్న మాట.

This post was last modified on August 27, 2020 10:06 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

1 hour ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago