టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై రాష్ట్రాలకు అతీతంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలతో ఉపాధి పొందిన యువత కూడా బాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు.. బాబు మద్దతు దారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వెళ్లారు. పోలీసుల రక్షణలో ఆయన కాన్వాయ్తో సహా వెళ్లినా.. మార్గమధ్యంలో అంబటి రాకను గుర్తించిన టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ.. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో కాన్వాయ్ను పక్కగా ఆపించిన అంబటి.. యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, చంద్ర బాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రి అంబటిని దూషించారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు అంబటి నిశ్చేష్టుడై రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ లోగా పోలీసులు జోక్యం చేసుకుని, యువతను సముదాయించి.. అంబటిని కాన్వాయ్ ఎక్కించి పంపించారు.
అయితే.. యువత మాత్రం కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అదేసమయంలో మరికొందరు డౌన్ డౌన్.. సీఎం జగన్ నినాదాలు చేశారు. మొత్తానికి తీవ్ర నిరసన దారితప్పకుండా పోలీసులు మంత్రిని అక్కడ నుంచి పంపించేయడంతో యువత శాంతించారు.
This post was last modified on October 27, 2023 2:39 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…