టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై రాష్ట్రాలకు అతీతంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలతో ఉపాధి పొందిన యువత కూడా బాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు.. బాబు మద్దతు దారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వెళ్లారు. పోలీసుల రక్షణలో ఆయన కాన్వాయ్తో సహా వెళ్లినా.. మార్గమధ్యంలో అంబటి రాకను గుర్తించిన టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ.. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో కాన్వాయ్ను పక్కగా ఆపించిన అంబటి.. యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, చంద్ర బాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రి అంబటిని దూషించారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు అంబటి నిశ్చేష్టుడై రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ లోగా పోలీసులు జోక్యం చేసుకుని, యువతను సముదాయించి.. అంబటిని కాన్వాయ్ ఎక్కించి పంపించారు.
అయితే.. యువత మాత్రం కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అదేసమయంలో మరికొందరు డౌన్ డౌన్.. సీఎం జగన్ నినాదాలు చేశారు. మొత్తానికి తీవ్ర నిరసన దారితప్పకుండా పోలీసులు మంత్రిని అక్కడ నుంచి పంపించేయడంతో యువత శాంతించారు.
This post was last modified on October 27, 2023 2:39 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…