టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై రాష్ట్రాలకు అతీతంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలతో ఉపాధి పొందిన యువత కూడా బాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు.. బాబు మద్దతు దారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వెళ్లారు. పోలీసుల రక్షణలో ఆయన కాన్వాయ్తో సహా వెళ్లినా.. మార్గమధ్యంలో అంబటి రాకను గుర్తించిన టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ.. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో కాన్వాయ్ను పక్కగా ఆపించిన అంబటి.. యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, చంద్ర బాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రి అంబటిని దూషించారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు అంబటి నిశ్చేష్టుడై రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ లోగా పోలీసులు జోక్యం చేసుకుని, యువతను సముదాయించి.. అంబటిని కాన్వాయ్ ఎక్కించి పంపించారు.
అయితే.. యువత మాత్రం కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అదేసమయంలో మరికొందరు డౌన్ డౌన్.. సీఎం జగన్ నినాదాలు చేశారు. మొత్తానికి తీవ్ర నిరసన దారితప్పకుండా పోలీసులు మంత్రిని అక్కడ నుంచి పంపించేయడంతో యువత శాంతించారు.
This post was last modified on October 27, 2023 2:39 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…