డీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.341 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే అభియోగంపై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం దీనిపై రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరోసారి చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
వాస్తవానికి స్కిల్ డెవలప్మెంటు కేసును కొట్టివేయాలని కోరుతూ.. చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. అయితే.. దీనిని కొట్టవేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) శుక్రవారం విచారణ జరిపింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు ఈ బెయిలు పిటిషన్ వచ్చింది.
దీనిని విచారణను చేపట్టేందుకు జస్టిస్ జ్యోతిర్మయి.. అంగీకరించలేదు.నాట్ బిఫోర్ మీ అంటూ విచారణను పక్కన పెట్టారు. అంటే.. ఈ బెయిల్ పిటిషన్పై తాను విచారణ చేపట్టలేనని జస్టిస్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మళ్లీ.. ఇది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్లనుంది. అప్పుడు ఎవరు విచారణ చేపడతారనే విషయంపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్పై 30 వరకు వాయిదా వేస్తూ.. జస్టిస్ జ్యోతిర్మయి ఆదేశాలు ఇచ్చారు.
This post was last modified on October 27, 2023 2:32 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…