టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన భువనేశ్వరి…వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్కిల్, రింగ్రోడ్, ఫైబర్నెట్ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడినందుకు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు సంఘీభావంగా పుంగనూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం బిడ్డలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారని, పుంగనూరులో ఆ బిడ్డలు టీ తాగుతుంటే..మన తెలుగు దేశం చొక్కా చింపి, జెండా చింపి కింద పడేశారని మండిపడ్డారు. కానీ, వారు ఒక్క విషయం మరచిపోతున్నారని, ఎంతమంది లీడర్లను అరెస్టు చేసినా..తెలుగు దేశం బిడ్డలు పైకి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకొని ప్రజలతో ముందుకు వెళతారని అన్నారు. వాళ్లు రెచ్చగొడుతున్నారని, కానీ, మనమంతా ధైర్యంగా చేయి చేయి కలిపి ఈ పోరాటంలో ముందుకు వెళదాం అంటూ భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు.
లోకేష్ పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని, కానీ, యాత్రను అడ్డుకోలేకపోయారని అన్నారు. ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే, టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ, చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఆయనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని, ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు.
This post was last modified on October 25, 2023 10:30 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…