టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన భువనేశ్వరి…వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్కిల్, రింగ్రోడ్, ఫైబర్నెట్ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడినందుకు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు సంఘీభావంగా పుంగనూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం బిడ్డలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారని, పుంగనూరులో ఆ బిడ్డలు టీ తాగుతుంటే..మన తెలుగు దేశం చొక్కా చింపి, జెండా చింపి కింద పడేశారని మండిపడ్డారు. కానీ, వారు ఒక్క విషయం మరచిపోతున్నారని, ఎంతమంది లీడర్లను అరెస్టు చేసినా..తెలుగు దేశం బిడ్డలు పైకి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకొని ప్రజలతో ముందుకు వెళతారని అన్నారు. వాళ్లు రెచ్చగొడుతున్నారని, కానీ, మనమంతా ధైర్యంగా చేయి చేయి కలిపి ఈ పోరాటంలో ముందుకు వెళదాం అంటూ భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు.
లోకేష్ పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని, కానీ, యాత్రను అడ్డుకోలేకపోయారని అన్నారు. ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే, టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ, చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఆయనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని, ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు.
This post was last modified on October 25, 2023 10:30 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…