Political News

బీజేపీ కోసం టీడీపీ త్యాగం..

బీజేపీ కోసం టీడీపీ త్యాగం చేస్తోందా? ఆ దిశ‌గా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న సంచ‌ల‌న చ‌ర్చ‌. ఇంత‌కీ ఏం జ‌రుగుతోందంటే.. వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌తో క‌లిసి పోటీకి వెళ్లాల‌ని టీడీపీ లెక్క‌లు వేసుకుంది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కలిసి వ‌చ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు.

ఇదిలావుంటే.. ఏపీలో పొత్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌క్రియ లో బీజేపీ నేత‌లు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం సాగుతోంది. దీనిలో భాగంగా .. తెలంగాణ‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉండాల‌నే ష‌ర‌తు విధించార‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది.

త‌మ‌కు అనుకూలంగా ఉన్న అంశాల‌పై అధ్య‌య‌నం చేసిన బీజేపీ నాయ‌కులు.. టీడీపీని దూరంగా ఉంచేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. “ఈ ఎన్నిక‌ల్లో మీరు దూరంగా ఉండ‌డం. ఏపీలో మీకు స‌హ‌క‌రిస్తాం” అనే దిశ‌గా బీజేపీ నేత‌లు.. టీడీపీకి ఒక దిశానిర్దేశం చేశార‌ని.. దానికి అనుగుణంగానే టీడీపీ కూడా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ దూరంగా ఉంది.

ఇప్ప‌టికే 87 స్థానాల్లో తాము పోటీకి సిద్ధ‌మ‌ని టీ-టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌క‌టించి కూడా వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ కూడా చేయ‌బోద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంటే.. ఒక ర‌కంగా.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకు ఈ సారి బీజేపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఒక‌ర‌కంగా.. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం.. తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల్సి రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

17 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

49 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago