టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణలో టీటీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా తెలంగాణలో సుప్తచేతనావస్థలో ఉన్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి పార్టీకి పునర్వైభవం తేవాలని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు అరెస్టు రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ తరఫు నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో అది ప్రచారంగానే మిగిలింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారంపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీనిచ్చారు. టీటీడీపీపై కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కుట్ర అని మండిపడ్డారు.
ఎన్నికల్లో పోటీకి 75 మంది అభ్యర్థుల జాబితా కూడా రెడీ అయిందని, చంద్రబాబు జైల్లో ఉండటంతో పేర్లు ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకోవడంతో జాప్యం జరుగుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని కాసాని భావిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కాసాని కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on October 24, 2023 9:31 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…