తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సోనియా గాంధీని నోటికొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఆమెను దేవత అంటూ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అని హరీష్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు….నోటుకు సీటు అనేవాళ్ళు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, తెలంగాణలో ఉన్న పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని హరీష్ రావు ప్రశ్నించారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కర్ణాటకలో ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ళ పండుగ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీ ప్రకారం కరెంటు ఇస్తారా లేక మొసలిని సబ్ స్టేషన్ లో వదిలిపెట్టమంటారా అంటూ కొంతమంది రైతులు ట్రాక్టర్లో మొసలిని తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో 200 యూనిట్ల విద్యుత్ రైతులకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చకపోవడంతో రైతులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే హామీని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో కేటీఆర్ ముందుంది ముసళ్ల పండుగ అంటూ చురకలంటించారు.
This post was last modified on October 24, 2023 9:26 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…