తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సోనియా గాంధీని నోటికొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఆమెను దేవత అంటూ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అని హరీష్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు….నోటుకు సీటు అనేవాళ్ళు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, తెలంగాణలో ఉన్న పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని హరీష్ రావు ప్రశ్నించారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కర్ణాటకలో ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ళ పండుగ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీ ప్రకారం కరెంటు ఇస్తారా లేక మొసలిని సబ్ స్టేషన్ లో వదిలిపెట్టమంటారా అంటూ కొంతమంది రైతులు ట్రాక్టర్లో మొసలిని తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో 200 యూనిట్ల విద్యుత్ రైతులకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చకపోవడంతో రైతులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే హామీని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో కేటీఆర్ ముందుంది ముసళ్ల పండుగ అంటూ చురకలంటించారు.
This post was last modified on October 24, 2023 9:26 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…