Political News

కాంగ్రెస్ కు ముందుంది మొసళ్లు పండగ: కేటీఆర్

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సోనియా గాంధీని నోటికొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఆమెను దేవత అంటూ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అని హరీష్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు….నోటుకు సీటు అనేవాళ్ళు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, తెలంగాణలో ఉన్న పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని హరీష్ రావు ప్రశ్నించారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కర్ణాటకలో ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ళ పండుగ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీ ప్రకారం కరెంటు ఇస్తారా లేక మొసలిని సబ్ స్టేషన్ లో వదిలిపెట్టమంటారా అంటూ కొంతమంది రైతులు ట్రాక్టర్లో మొసలిని తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో 200 యూనిట్ల విద్యుత్ రైతులకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చకపోవడంతో రైతులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే హామీని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో కేటీఆర్ ముందుంది ముసళ్ల పండుగ అంటూ చురకలంటించారు.

This post was last modified on October 24, 2023 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago