సరిగ్గా ఎన్నికల ముందు కేసీయార్ తో పాటు మొత్తం బీఆర్ఎస్ డిఫెన్సులో పడిపోయింది. ఎలాగంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారెజిలోని రెండు పిల్లర్లు కుంగిపోవటంతో కేసీయార్ అండ్ కో పైన దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీయార్ రూపకల్పనగాను, కేసీయార్ మానసపుత్రికగాను బీఆర్ఎస్ పదేపదే ప్రచారం చేసుకున్నది. కేసీయార్ కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగలిగినట్లు ఒకటే ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
అలాంటిది ఇపుడు ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతుండటంతో ఏమి మాట్లాడాలో అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ఇవే విషయాలను ప్రస్తావిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ప్రతిపక్షాల ఆరోపణలకు ఏమని సమాధానం చెప్పాలో మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలకు దిక్కుతోచటంలేదు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు జరగటంతో కేసీయార్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఇరిగేషన్ శాఖ కేసీయార్ ఆధీనంలోనే ఉండటం. కాబట్టి రెండు ప్రాజెక్టుల్లోని లోపాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీయార్ మీదే ఉంది. అయితే సహజంగానే కేసీయార్ ఎవరికీ అందుబాటులో ఉండరు కాబట్టి అందుబాటులో ఉండే మంత్రులనే ప్రతిపక్షాలు, జనాలు టార్గెట్ చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించారంటు ప్రతిపక్షాలు నేతలు పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆరోపణలు చేయటమే కాకుండా ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
దాంతో ప్రతిపక్షాల దెబ్బకు ప్రభుత్వంతో పాటు అధికారపార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. అందుకనే మంత్రులతో పాటు ఎంఎల్ఏలు మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు. కేసీయార్ ఆధీనంలో ఉండే శాఖ కాబట్టి ఎవరితో ఏమి మాట్లాడితే సమస్యలు వస్తాయో అనే టెన్షన్ తో అందరు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పోనీ ప్రభుత్వం తరపున మీడియాకు ఏమైనా ప్రకటన విడుదలైందా అంటే అదీలేదు. మొత్తానికి ఎన్నికల్లో కేసీయార్ ను ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమే దొరికింది.
This post was last modified on October 24, 2023 12:01 pm
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…
పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే,…
ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న…
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…