సరిగ్గా ఎన్నికల ముందు కేసీయార్ తో పాటు మొత్తం బీఆర్ఎస్ డిఫెన్సులో పడిపోయింది. ఎలాగంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారెజిలోని రెండు పిల్లర్లు కుంగిపోవటంతో కేసీయార్ అండ్ కో పైన దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీయార్ రూపకల్పనగాను, కేసీయార్ మానసపుత్రికగాను బీఆర్ఎస్ పదేపదే ప్రచారం చేసుకున్నది. కేసీయార్ కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగలిగినట్లు ఒకటే ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
అలాంటిది ఇపుడు ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతుండటంతో ఏమి మాట్లాడాలో అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ఇవే విషయాలను ప్రస్తావిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తు ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ప్రతిపక్షాల ఆరోపణలకు ఏమని సమాధానం చెప్పాలో మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలకు దిక్కుతోచటంలేదు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు జరగటంతో కేసీయార్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఇరిగేషన్ శాఖ కేసీయార్ ఆధీనంలోనే ఉండటం. కాబట్టి రెండు ప్రాజెక్టుల్లోని లోపాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీయార్ మీదే ఉంది. అయితే సహజంగానే కేసీయార్ ఎవరికీ అందుబాటులో ఉండరు కాబట్టి అందుబాటులో ఉండే మంత్రులనే ప్రతిపక్షాలు, జనాలు టార్గెట్ చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించారంటు ప్రతిపక్షాలు నేతలు పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆరోపణలు చేయటమే కాకుండా ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
దాంతో ప్రతిపక్షాల దెబ్బకు ప్రభుత్వంతో పాటు అధికారపార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. అందుకనే మంత్రులతో పాటు ఎంఎల్ఏలు మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు. కేసీయార్ ఆధీనంలో ఉండే శాఖ కాబట్టి ఎవరితో ఏమి మాట్లాడితే సమస్యలు వస్తాయో అనే టెన్షన్ తో అందరు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పోనీ ప్రభుత్వం తరపున మీడియాకు ఏమైనా ప్రకటన విడుదలైందా అంటే అదీలేదు. మొత్తానికి ఎన్నికల్లో కేసీయార్ ను ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమే దొరికింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…