తెలంగాణా బీజేపీలో ఇపుడు అందరిచూపు మాజీమంత్రి డీకే అరుణపైనే పడింది. జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో డీకే బాగా యాక్టివ్ గానే పార్టీలో పనిచేస్తున్నారు. అలాంటిది 52 మందితో పార్టీ ప్రకటించిన మొదటిజాబితాలో డీకే పేరు కనబడలేదు. దాంతో చాలామంది అనేకరకాలుగా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇదే సమయంలో గద్వాల నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పోటీచేయకూడదని డీకే తీసుకున్న నిర్ణయం కారణంగానే మొదటిజాబితాలో ఆమె పేరు లేదని అర్ధమవుతోంది.
గద్వాల నుండి డీకే ఎందుకని పోటీచేయటంలేదనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. డీకే సమీపబంధువు, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే కేసీయార్ టికెట్ ప్రకటించారు. వీళ్ళిద్దరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే డీకే మాత్రం చివరి నిముషంలో పోటీకి వెనకాడటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ లో చేరి పోటీకి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ కు సానుకూల పవనాలు పెరుగుతున్నాయనే ప్రచారం, బీసీ వాదం బలపడుతోంది. కాబట్టి సరితే కాంగ్రెస్ తరపున పోటీలో ఉండేందుకు అవకాశాలున్నాయి.
ఒకవైపు దగ్గరి బంధులు మరోవైపు బీసీ వాదం, కాంగ్రెస్ గాలి కారణంగానే ఓటమి భయంతోనే డీకే అసెంబ్లీకి పోటీచేయకూడదని అనుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న బీసీ వాదాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ తరపున బలమైన బీసీ నేతను పోటీలోకి దింపాలని డీకే డిసైడ్ అయ్యారనే ప్రచారం మొదలైంది.
ఎంతమంది మద్దతుదారులు గద్వాలలో పోటీచేయాలని డీకేపై ఒత్తిడి తెస్తున్నా ఆమె మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఆమె రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విషయం ఏమిటో తేలిపోతుంది కాబట్టి దాని తర్వాత పార్లమెంటుకు పోటీపై నిర్ణయం తీసుకోవచ్చని డీకే అనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ అంచనా వేసినట్లు ఫలితాలు ఉంటే పార్లమెంటుకు డీకే పోటీచేస్తారని లేకపోతే అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయించుకుంటారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. మొత్తానికి గద్వాలలో పోటీచేయకూడదన్న డీకే నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
This post was last modified on October 24, 2023 11:59 am
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…