తెలంగాణా బీజేపీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నట్లే ఈ పార్టీలో కూడా అసమ్మతి, తిరుగుబాట్లు మొదలవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి, అసంతృప్తులు, తిరుగుబాట్లు ఉన్నాయంటే అర్ధముంది. కానీ బీజేపీలో కూడా కనబడుతోందంటేనే విచిత్రంగా ఉంది. కారణం ఏమిటంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీలో గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. గట్టి అభ్యర్ధులను కూడా తయారుచేసుకోలేని పార్టీలో కూడా టికెట్ల కేటాయింపు సందర్భంగా అసంతృప్తులు, తిరుగుబాట్లంటేనే విడ్డూరంగా ఉంది.
టికెట్లు దక్కకపోవటంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు మండిపోతున్నారు. వీళ్ళంతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి తాము రెబల్ అభ్యర్ధులుగా పోటీలో ఉండబోతున్నట్లు వార్నింగులు ఇస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని ఏనుగుల రవీందరరెడ్డి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండే ఏనుగుల టికెట్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ మాత్రం రావు పద్మకు టికెట్ ప్రకటించింది. దాంతో ఏనుగుల మండిపోతున్నారు.
అలాగే మానుకొడూరులో పార్టీ సీనియర్ నేత శంకర్ ను పక్కనపెట్టేసి ఈమధ్యనే పార్టీలో చేరిన ఆరేపల్లి మోహన్ కు టికెట్ దక్కింది. రామగుండంలో ఈమధ్యనే పార్టీలో చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్ దక్కటం సీనియర్ నేతలను బాగా మండిస్తోంది. గోషామహల్ టికెట్ ను విక్రమ్ గౌడ్ కు కేటాయించబోతున్నట్లు ఇంతకాలం పార్టీ ఫీలర్లు వదిలింది తీరాచూస్తే సిట్టింగ్ ఎంఎల్ఏ రాజాసింగ్ కే కేటాయించటంతో విక్రమ్ గౌడ్ మండిపోతున్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీచేయాలని చాలాకాలంగా పనిచేసుకుంటున్న మాజీ ఎంఎల్ఏ యెండల లక్ష్మీనారాయణకు పార్టీ మొండిచెయ్యి చూపింది. టికెట్ ప్రకటించిన ధన్ పాల్ సూర్యానారాయణ గుప్తాను యెండల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి అసంతృప్తి వాదులు పెరిగిపోతున్నారు. వీళ్ళని పార్టీ నాయకత్వం ఎలా కన్వీన్స్ చేస్తుందన్నది పాయింట్. ఇదేకాకుండా చాలామంది ముఖ్యనేతలకు మొదటిజాబితాలో టికెట్లు ప్రకటించలేదు. దాంతో వాళ్ళంగా అయోమయంలో పడిపోయారు. మొత్తానికి టికెట్ల ప్రకటన అన్నది బీజేపీలో పెద్ద అయోమయానికి గురిచేస్తోందన్నది వాస్తవం.
This post was last modified on October 24, 2023 12:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…