మాజీ ఎమ్మెల్యే, సీనియర్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్దేశంలో తన వ్యాఖ్యలు.. కాంగ్రెస్కు మేలు చేస్తాయని అనుకుని ఉండొచ్చు. కానీ, ఇప్పటికే ఉప్పు-నిప్పుగా ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య మోత్కుపల్లి మరో విపత్తుకు తెరదీశారనే చర్చ సాగుతుండడం గమనార్హం. తాజాగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.
తెలంగాణలో జరుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం ఎక్కితే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అవ్వాల్సిన అవసరం ఉందని.. ఆయనకే అధిష్టానం మొగ్గు కూడా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేవంత్రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. చెప్పుకొచ్చారు. అయితే, వాస్తవానికి ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు నుంచి నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు.
వీరంతా తమ తమ మందీమార్బలాలతో బహిరంగ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక, కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో మౌనంగా ఉంది. ముందు గెలిచాక.. తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై నిర్ణయం తీసుకునేలా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇంతలో మోత్కుపల్లి రేవంత్ను ఎత్తేస్తూ.. ఆయనే సీఎం అవుతారని.. ఆయనకు సీఎం సీటు ఇవ్వకపోతే.. అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇక, కాంగ్రెస్ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించడం పార్టీలో మరో చిచ్చుకు దారితీసే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్పై మరోసారి మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. ఆయన ఆరోగ్యం బాగోలేదనే వార్తలు వస్తున్నాయని.. రేపో మాపో ఆయన ఆసుపత్రిలో చేరతారని తనకు సమాచారం ఉందని, అలాంటి నాయకుడికి ఓట్లేస్తే.. మళ్లీ కుటుంబ పాలనే వస్తుందని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చింది చాలని.. దొరల పాలనతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 23, 2023 7:22 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…