ఏపీలో జరగనున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు యుద్ధప్రాతిపదికన కదులుతున్న తెలుగు దేశం పార్టీలో కొన్నాళ్లుగా రగులుతున్న అసంతృప్తి.. ఎన్నికల ముంగిట మరింత పెరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉందని నాయకులు భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సుమారు 40 నియోజకవర్గాలకుపైగానే అసంతృప్తి ఛాయల్లో నలుగుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని కొందరు.. తమకు టికెట్ ఇస్తారో లేదో అని కొందరు తమ్ముళ్లు మీమాంసలో రగిలిపోతున్నారు.
ఉదాహరణకు.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల స్థానాలు, ఉమ్మడి కృష్ణాలోని గుడివాడ, నూజివీడు, పెడన, గన్నవరం(ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డకు టికెట్ ప్రకటించడంపై తమ్ముళ్లు రగులుతు న్నారు), విజయవాడ పశ్చిమ, అనంతపురంలోని కదిరి, అనంతపురం అర్బన్, పుట్టపర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, తాడికొండ, శ్రీకాకుళంలోని శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లోని నరసాపురం, ఉండి, భీమవరం వంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి చాపకింద నీరులా ఉంది.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తూర్పులోని తుని(ఇక్కడ మాజీ మంత్రి యనమల కుటుంబానికే టికెట్ ఇస్తుండడం, వారు ఓడిపోతుండడంపై తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు), ప్రత్తిపాడు వంటి అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్లు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. జనసేనతో పొత్తు దరిమిలా వీటిలో సగం స్థానాలకుపైగానే.. జనసేన కు కేటాయించే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలం ఎక్కువగా ఉందనేది సమాచారం.
ఈ నేపథ్యంలో టీడీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న తమ్ముళ్లు ముందు ఈ విషయం తేల్చాలని పట్టుబ డుతున్నారు. తాజాగా నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ముగియగానే.. దాదాపు 20 మందికిపైగా నాయకులు లోకేష్ను చుట్టుముట్టి తమ ఆవేదనను వెల్లడించారు. టికెట్లపై భరోసా ఇస్తేరంగంలోకి దిగుతామని చెప్పారు. అయితే, టికెట్ల విషయాన్ని చంద్రబాబు చూసుకుంటారని.. ఆ విషయం పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయాలని, జనసేనతో కలిసి ముందుకు సాగాలని మాత్రమే లోకేష్ చెప్పుకొచ్చారని సమాచారం. ఇది పైకి బాగానే ఉన్నప్పటికీ.. టికెట్లు ఆశిస్తున్న తమ్ముళ్లలో మాత్రం అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. దీనిని కాదనలేని పరిస్థితి నెలకొంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 23, 2023 7:17 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…