వచ్చే 2024 ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చినట్టు తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. ఆయా వర్గాలకు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. లబ్ధి దారుల సంఖ్యను తగ్గించడం ద్వారా.. ఆర్థిక భారం నుంచి సర్కారు తప్పించుకుంటోందని టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఎన్నికలకు ముందు.. ఈ పరిణామం ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ.. ఇప్పుడు ప్రతి కుటుంబానికీ ఏదో ఒకటి పల్లవిని వినిపించేలా వ్యూహం రెడీ చేస్తోంది. దీనిపై తాజాగా సీఎం జగన్.. తనకు అందుబాటులో ఉన్న సలహదారులు, ముఖ్య నాయకులతో చర్చించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇప్పటి వరకు లబ్ధి పొందని కుటుంబాలను ఎంపిక చేసుకుని.. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పథకం అమలు చేయడమో.. లేక ఉన్న వాటిలోనే ఒకటి వారికి అమలు చేయడమో చేయనున్నారు.
మొత్తంగా రాష్ట్రంలోని 2.5 కోట్ల కుటుంబాల్లో ఇప్పటికే లబ్ధి పొందుతున్న కోటిన్నర కుటుంబాలను పక్కన పెట్టి.. మిగిలిన కోటి కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపంలో వచ్చే మూడు మాసాల్లో పథకాలను విస్తృతంగా అమలు చేయాలనేది వ్యూహం. దీనిపై వచ్చే 15 రోజుల్లోనే వలంటీర్లు, గృహ సారథుల ద్వారా కీలక సర్వే చేయించి.. ఇప్పటి వరకు సర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించనున్నారు. వారికి వెంటనే ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యంగా కాపులు, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లోని అర్హులను ఇప్పుడు తెరమీదికి తెచ్చేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయనుందని సమాచారం. తద్వారా ఆయా సామాజిక వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడం, ఓటు బ్యాంకు ను తమవైపు సాధ్యమైనంత వరకు తిప్పుకొనే దిశగా అడుగులు వేయనుంది. ఇదేసమయంలో ఎన్నికలకు ముందు పెట్రోల్పై రాష్ట్రసర్ చార్జీలను తగ్గించాలనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం పెట్రోల్ ధరలపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి ప్రతి కుటుంబానికీ ఏదో ఒకటి నినాదాంతో వైసీపీ ఇకపై ముందుకు సాగనుందని సమాచారం. మరి ఇది ఏమేరకు లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.
This post was last modified on October 23, 2023 11:36 am
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…