Political News

ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక‌టి.. గేర్ మార్చిన‌ వైసీపీ

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చిన‌ట్టు తెలుస్తోంది. తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు.. ఆయా వ‌ర్గాల‌కు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. ల‌బ్ధి దారుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం ద్వారా.. ఆర్థిక‌ భారం నుంచి స‌ర్కారు త‌ప్పించుకుంటోంద‌ని టీడీపీ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ ప‌రిణామం ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌చారాస్త్రం అయ్యే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన వైసీపీ.. ఇప్పుడు ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక‌టి ప‌ల్లవిని వినిపించేలా వ్యూహం రెడీ చేస్తోంది. దీనిపై తాజాగా సీఎం జ‌గ‌న్‌.. త‌న‌కు అందుబాటులో ఉన్న స‌ల‌హ‌దారులు, ముఖ్య నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి పొంద‌ని కుటుంబాల‌ను ఎంపిక చేసుకుని.. వారికి ప్ర‌త్యామ్నాయంగా ఏదైనా ప‌థ‌కం అమ‌లు చేయ‌డ‌మో.. లేక ఉన్న వాటిలోనే ఒక‌టి వారికి అమ‌లు చేయ‌డ‌మో చేయ‌నున్నారు.

మొత్తంగా రాష్ట్రంలోని 2.5 కోట్ల కుటుంబాల్లో ఇప్ప‌టికే ల‌బ్ధి పొందుతున్న కోటిన్న‌ర కుటుంబాల‌ను ప‌క్క‌న పెట్టి.. మిగిలిన కోటి కుటుంబాల‌కు కూడా ఏదో ఒక రూపంలో వ‌చ్చే మూడు మాసాల్లో ప‌థ‌కాల‌ను విస్తృతంగా అమ‌లు చేయాల‌నేది వ్యూహం. దీనిపై వ‌చ్చే 15 రోజుల్లోనే వ‌లంటీర్లు, గృహ సార‌థుల ద్వారా కీల‌క స‌ర్వే చేయించి.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా ల‌బ్ధి పొంద‌ని వారిని గుర్తించ‌నున్నారు. వారికి వెంట‌నే ఏదో ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్యంగా కాపులు, రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లోని అర్హులను ఇప్పుడు తెర‌మీదికి తెచ్చేలా వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌నుంద‌ని స‌మాచారం. త‌ద్వారా ఆయా సామాజిక వ‌ర్గాల్లో నెల‌కొన్న అసంతృప్తిని త‌గ్గించ‌డం, ఓటు బ్యాంకు ను త‌మ‌వైపు సాధ్య‌మైనంత వ‌ర‌కు తిప్పుకొనే దిశ‌గా అడుగులు వేయ‌నుంది. ఇదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్‌పై రాష్ట్ర‌స‌ర్ చార్జీల‌ను త‌గ్గించాల‌నేది కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. మొత్తానికి ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒకటి నినాదాంతో వైసీపీ ఇక‌పై ముందుకు సాగ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి ఇది ఏమేర‌కు ల‌బ్ధి చేకూరుస్తుందో చూడాలి.

This post was last modified on October 23, 2023 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

12 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago