వచ్చే 2024 ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చినట్టు తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. ఆయా వర్గాలకు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. లబ్ధి దారుల సంఖ్యను తగ్గించడం ద్వారా.. ఆర్థిక భారం నుంచి సర్కారు తప్పించుకుంటోందని టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఎన్నికలకు ముందు.. ఈ పరిణామం ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ.. ఇప్పుడు ప్రతి కుటుంబానికీ ఏదో ఒకటి పల్లవిని వినిపించేలా వ్యూహం రెడీ చేస్తోంది. దీనిపై తాజాగా సీఎం జగన్.. తనకు అందుబాటులో ఉన్న సలహదారులు, ముఖ్య నాయకులతో చర్చించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇప్పటి వరకు లబ్ధి పొందని కుటుంబాలను ఎంపిక చేసుకుని.. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పథకం అమలు చేయడమో.. లేక ఉన్న వాటిలోనే ఒకటి వారికి అమలు చేయడమో చేయనున్నారు.
మొత్తంగా రాష్ట్రంలోని 2.5 కోట్ల కుటుంబాల్లో ఇప్పటికే లబ్ధి పొందుతున్న కోటిన్నర కుటుంబాలను పక్కన పెట్టి.. మిగిలిన కోటి కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపంలో వచ్చే మూడు మాసాల్లో పథకాలను విస్తృతంగా అమలు చేయాలనేది వ్యూహం. దీనిపై వచ్చే 15 రోజుల్లోనే వలంటీర్లు, గృహ సారథుల ద్వారా కీలక సర్వే చేయించి.. ఇప్పటి వరకు సర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించనున్నారు. వారికి వెంటనే ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యంగా కాపులు, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లోని అర్హులను ఇప్పుడు తెరమీదికి తెచ్చేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయనుందని సమాచారం. తద్వారా ఆయా సామాజిక వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడం, ఓటు బ్యాంకు ను తమవైపు సాధ్యమైనంత వరకు తిప్పుకొనే దిశగా అడుగులు వేయనుంది. ఇదేసమయంలో ఎన్నికలకు ముందు పెట్రోల్పై రాష్ట్రసర్ చార్జీలను తగ్గించాలనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం పెట్రోల్ ధరలపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి ప్రతి కుటుంబానికీ ఏదో ఒకటి నినాదాంతో వైసీపీ ఇకపై ముందుకు సాగనుందని సమాచారం. మరి ఇది ఏమేరకు లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.
This post was last modified on October 23, 2023 11:36 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…