అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు. ఎంత అధికార పక్షమైనప్పటికి అహంకారం తలకెక్కకూడదు. అలాంటి తీరు చూసే వారికి ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తుంది.
అందునా.. తన మానాన తాను యాత్ర చేసుకుంటూ పోతున్నోడిని కెలికి మరీ.. లోకల్ జులం చూపిస్తూ.. దారుణంగా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా నిలుస్తూ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు సైకిల్ యాత్ర చేపట్టటం.. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో యాత్ర చేసుకుంటూ వెళుతున్న వారిపై దాష్ఠీకం ప్రదర్శించిన వారికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటూ ఆయనకు సన్నిహితంగా ఉండే చెంగలాపురం సూరి వ్యవహారశైలి ఇప్పుడు షాకింగ్ గా మారింది. భౌతికదాడులకు పాల్పడటం.. అల్లర్లు.. నేరాలకు తెగబడుతూ ప్రభుత్వానికి.. పార్టీకి చెడ్డపేరు తెస్తుంటారన్న పేరుంది.
మదనపల్లి నియోజకవర్గంలో అతడు చేసే అరాచకాలకు అంతే లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అతగాడిపై ఉన్న రౌడీషీట్ ను పోలీసులు ఎత్తేయటం గమనార్హం. సూరి వద్ద కారు డ్రైవర్ గా పని చేసే వినయ్ మీద రెండు కేసులు ఉన్నాయి. సూరితో సన్నిహితంగా ఉండే శివప్పకు నేరచరిత్ర ఉందని చెబుతున్నారు. మొత్తంగా రౌడీయిజంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇతగాడి తీరుతో మంత్రి పెద్దిరెడ్డికి లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పేరుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకున్నా.. చేసేది మాత్రం సెటిల్ మెంట్లు.. దందాలేనని చెబుతుంటారు. పుంగనూరు నియోజకవర్గంలో తరచూ పలువురు వ్యాపారుల్ని బెదిరిస్తూ.. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళుతున్న వేళ.. వారిని అడ్డుకొని.. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకూడదని వార్నింగ్ ఇస్తూ.. సైకిల్ కు ఉన్న పార్టీ జెండాను తొలగించటమే కాదు.. వారు ధరించిన పసుపు చొక్కాను సైతం విప్పించి.. పంపించిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ పని చేసిందెవరు? అన్న అరా పెరిగింది. ఇలాంటి వేళ.. చెంగలాపురం సూరి పేరు బయటకు రావటమే కాదు.. ఈ సందర్భంగా అతగాడి లీలలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయంపై మరింత స్పష్టత వచ్చింది.
This post was last modified on October 23, 2023 11:35 am
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…