Political News

పొత్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి: ప‌వ‌న్ దిశానిర్దేశం

వచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయ‌ని.. ఈ విష‌యాన్ని గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సూచించారు. ఎక్క‌డా విభేదాలు వ‌ద్ద‌ని.. ఎవ‌రితోనూ పేచీలు పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న‌దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమ‌య్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ విధానాలకు ప్ర‌తి ఒక్క‌రూ కట్టుబడి మాట్లాడాలని, ఉండాల‌ని చెప్పారు. ఎవ‌రూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు దిగ‌వ‌ద్ద‌ని సూచించారు. పొత్తుల విష‌యంలో ఎవ‌రూ మాట్లాడ వ‌ద్ద‌ని.. ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. దీనిలో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌న్నారు. అయితే.. సీట్లు టికెట్ల వ్య‌వ‌హారాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని సూచించారు. ప‌నిచేసేవారికి.. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా, ఆర్థిక ప‌రిస్థితికి అతీతంగా టికెట్లు ద‌క్కుతాయ‌ని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని తేల్చి చెప్పారు.

ఎక్క‌డైనా ఎవ‌రితోనైనా.. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న మ‌రోసారి పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే వారాహి యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌లో ఎలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేయాల‌నే విష‌యాన్ని త‌మ‌కు వ‌దిలేయాల‌ని కార్య‌క‌ర్త‌లు పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on October 21, 2023 10:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

14 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago