Political News

పొత్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి: ప‌వ‌న్ దిశానిర్దేశం

వచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయ‌ని.. ఈ విష‌యాన్ని గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సూచించారు. ఎక్క‌డా విభేదాలు వ‌ద్ద‌ని.. ఎవ‌రితోనూ పేచీలు పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న‌దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమ‌య్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ విధానాలకు ప్ర‌తి ఒక్క‌రూ కట్టుబడి మాట్లాడాలని, ఉండాల‌ని చెప్పారు. ఎవ‌రూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు దిగ‌వ‌ద్ద‌ని సూచించారు. పొత్తుల విష‌యంలో ఎవ‌రూ మాట్లాడ వ‌ద్ద‌ని.. ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. దీనిలో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌న్నారు. అయితే.. సీట్లు టికెట్ల వ్య‌వ‌హారాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని సూచించారు. ప‌నిచేసేవారికి.. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా, ఆర్థిక ప‌రిస్థితికి అతీతంగా టికెట్లు ద‌క్కుతాయ‌ని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని తేల్చి చెప్పారు.

ఎక్క‌డైనా ఎవ‌రితోనైనా.. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న మ‌రోసారి పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే వారాహి యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌లో ఎలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేయాల‌నే విష‌యాన్ని త‌మ‌కు వ‌దిలేయాల‌ని కార్య‌క‌ర్త‌లు పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on October 21, 2023 10:41 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago