వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లనున్నాయని.. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎక్కడా విభేదాలు వద్దని.. ఎవరితోనూ పేచీలు పెట్టుకోవద్దని ఆయనదిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ విధానాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి మాట్లాడాలని, ఉండాలని చెప్పారు. ఎవరూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు దిగవద్దని సూచించారు. పొత్తుల విషయంలో ఎవరూ మాట్లాడ వద్దని.. ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని.. దీనిలో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు. అయితే.. సీట్లు టికెట్ల వ్యవహారాన్ని తనకు వదిలేయాలని సూచించారు. పనిచేసేవారికి.. కులాలకు, మతాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితికి అతీతంగా టికెట్లు దక్కుతాయని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని తేల్చి చెప్పారు.
ఎక్కడైనా ఎవరితోనైనా.. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. త్వరలోనే వారాహి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఎన్నికలలో ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు వేయాలనే విషయాన్ని తమకు వదిలేయాలని కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేదిశగా పనిచేయాలని సూచించారు.
This post was last modified on October 21, 2023 10:41 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…