Political News

పొత్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి: ప‌వ‌న్ దిశానిర్దేశం

వచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయ‌ని.. ఈ విష‌యాన్ని గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సూచించారు. ఎక్క‌డా విభేదాలు వ‌ద్ద‌ని.. ఎవ‌రితోనూ పేచీలు పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న‌దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమ‌య్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ విధానాలకు ప్ర‌తి ఒక్క‌రూ కట్టుబడి మాట్లాడాలని, ఉండాల‌ని చెప్పారు. ఎవ‌రూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు దిగ‌వ‌ద్ద‌ని సూచించారు. పొత్తుల విష‌యంలో ఎవ‌రూ మాట్లాడ వ‌ద్ద‌ని.. ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. దీనిలో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌న్నారు. అయితే.. సీట్లు టికెట్ల వ్య‌వ‌హారాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని సూచించారు. ప‌నిచేసేవారికి.. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా, ఆర్థిక ప‌రిస్థితికి అతీతంగా టికెట్లు ద‌క్కుతాయ‌ని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని తేల్చి చెప్పారు.

ఎక్క‌డైనా ఎవ‌రితోనైనా.. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న మ‌రోసారి పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే వారాహి యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌లో ఎలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేయాల‌నే విష‌యాన్ని త‌మ‌కు వ‌దిలేయాల‌ని కార్య‌క‌ర్త‌లు పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా ప‌నిచేయాల‌ని సూచించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago