Political News

మా అమ్మ‌ను సీఐడీ బెదిరించింది.. కేసు పెడ‌తానంది:  లోకేష్ కంట‌త‌డి

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గుర‌య్యారు. పార్టీ రాష్ట్ర‌స్థాయి నేతల విస్తృత స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న మాతృమూర్తి విష‌యంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్య‌వ‌హ‌రించిన తీరును వివ‌రిస్తూ.. క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు. `మా అమ్మ‌ను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడ‌తామ‌న్నారు. జైలులో ములాఖ‌త్ అయిపోయినా.. టైం తెలియ‌డం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవ‌త్స‌రాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణికి ఇచ్చే గౌర‌వం“ అంటూ.. నారా లోకేష్ క‌న్నీరు పెట్టుకున్నారు.

చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని  నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయ‌న‌కు త‌ప్పులు చేయ‌డం తెలియ‌ద‌న్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?.   సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు.  గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు.  నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా?  నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

“త‌న త‌ల్లిని, చెల్లిన అవ‌మానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి త‌ల్లి విష‌యంలో మ‌ర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. కాగా, నిజం గెల‌వాలి పేరుతో నారా భువ‌నేశ్వ‌రి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తార‌ని నారా లోకేష్ చెప్పారు. చంద్ర‌బాబు జైలుపాల‌య్యార‌న్న విష‌యంతో ఉద్విగ్న‌త చెంది మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తా ర‌ని తెలిపారు. భువ‌నేశ్వ‌రికి తోడుగా తెలుగు మ‌హిళ నాయ‌కులు కూడా ఉంటార‌ని.. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శ‌క్తులు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని, రెచ్చ‌గొడ‌తార‌ని అయినా.. మ‌న ప‌ని మ‌నం చేసుకుందామ‌ని నారా లోకేష్ చెప్పారు.

This post was last modified on October 21, 2023 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago