Political News

మా అమ్మ‌ను సీఐడీ బెదిరించింది.. కేసు పెడ‌తానంది:  లోకేష్ కంట‌త‌డి

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గుర‌య్యారు. పార్టీ రాష్ట్ర‌స్థాయి నేతల విస్తృత స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న మాతృమూర్తి విష‌యంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్య‌వ‌హ‌రించిన తీరును వివ‌రిస్తూ.. క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు. `మా అమ్మ‌ను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడ‌తామ‌న్నారు. జైలులో ములాఖ‌త్ అయిపోయినా.. టైం తెలియ‌డం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవ‌త్స‌రాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణికి ఇచ్చే గౌర‌వం“ అంటూ.. నారా లోకేష్ క‌న్నీరు పెట్టుకున్నారు.

చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని  నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయ‌న‌కు త‌ప్పులు చేయ‌డం తెలియ‌ద‌న్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?.   సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు.  గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు.  నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా?  నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

“త‌న త‌ల్లిని, చెల్లిన అవ‌మానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి త‌ల్లి విష‌యంలో మ‌ర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. కాగా, నిజం గెల‌వాలి పేరుతో నారా భువ‌నేశ్వ‌రి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తార‌ని నారా లోకేష్ చెప్పారు. చంద్ర‌బాబు జైలుపాల‌య్యార‌న్న విష‌యంతో ఉద్విగ్న‌త చెంది మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తా ర‌ని తెలిపారు. భువ‌నేశ్వ‌రికి తోడుగా తెలుగు మ‌హిళ నాయ‌కులు కూడా ఉంటార‌ని.. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శ‌క్తులు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని, రెచ్చ‌గొడ‌తార‌ని అయినా.. మ‌న ప‌ని మ‌నం చేసుకుందామ‌ని నారా లోకేష్ చెప్పారు.

This post was last modified on October 21, 2023 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago