టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి సతీమణికి ఇచ్చే గౌరవం“ అంటూ.. నారా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయనకు తప్పులు చేయడం తెలియదన్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?. సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు. గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
“తన తల్లిని, చెల్లిన అవమానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి తల్లి విషయంలో మర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కాగా, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని నారా లోకేష్ చెప్పారు. చంద్రబాబు జైలుపాలయ్యారన్న విషయంతో ఉద్విగ్నత చెంది మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తా రని తెలిపారు. భువనేశ్వరికి తోడుగా తెలుగు మహిళ నాయకులు కూడా ఉంటారని.. ఈ పర్యటనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని, రెచ్చగొడతారని అయినా.. మన పని మనం చేసుకుందామని నారా లోకేష్ చెప్పారు.
This post was last modified on October 21, 2023 8:23 pm
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…