టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి సతీమణికి ఇచ్చే గౌరవం“ అంటూ.. నారా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయనకు తప్పులు చేయడం తెలియదన్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?. సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు. గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
“తన తల్లిని, చెల్లిన అవమానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి తల్లి విషయంలో మర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కాగా, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని నారా లోకేష్ చెప్పారు. చంద్రబాబు జైలుపాలయ్యారన్న విషయంతో ఉద్విగ్నత చెంది మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తా రని తెలిపారు. భువనేశ్వరికి తోడుగా తెలుగు మహిళ నాయకులు కూడా ఉంటారని.. ఈ పర్యటనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని, రెచ్చగొడతారని అయినా.. మన పని మనం చేసుకుందామని నారా లోకేష్ చెప్పారు.
This post was last modified on October 21, 2023 8:23 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…