టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి సతీమణికి ఇచ్చే గౌరవం“ అంటూ.. నారా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయనకు తప్పులు చేయడం తెలియదన్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?. సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు. గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
“తన తల్లిని, చెల్లిన అవమానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి తల్లి విషయంలో మర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కాగా, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని నారా లోకేష్ చెప్పారు. చంద్రబాబు జైలుపాలయ్యారన్న విషయంతో ఉద్విగ్నత చెంది మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తా రని తెలిపారు. భువనేశ్వరికి తోడుగా తెలుగు మహిళ నాయకులు కూడా ఉంటారని.. ఈ పర్యటనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని, రెచ్చగొడతారని అయినా.. మన పని మనం చేసుకుందామని నారా లోకేష్ చెప్పారు.
This post was last modified on October 21, 2023 8:23 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…